ఒకప్పుడు పలు తెలుగు సినిమాలు, సీరియళ్లలో సహాయ నటిగా వాహిని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సౌందర్య నటించిన ‘శ్వేత నాగు’ చిత్రంలో వాసుకి పాత్రతో పాటు అనేక సీరియళ్ల ద్వారా ఆమె బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే వాహిని పరిస్థితి గురించి టాలీవుడ్ నటి నటి కరాటే కళ్యాణి అసలు విషయం బయటపెట్టారు.
సోషల్మీడియా ద్వారా వాహిని ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె వెల్లడించరు. కళ్యాణి చెప్పడం వల్లే వాహిణి విషయం బయటికి వచ్చింది. గత కొన్ని నెలలుగా వాహిని అడ్వాన్స్డ్ స్టేజ్ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో కొన్ని అవయవాల పనితీరు కూడా క్షీణించినట్టు తెలుస్తోంది. దాంతో ఆమెను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి.. అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కీమోథెరపీ, నిరంతర వైద్య సేవలతో పాటు సర్జరీలు కూడా చేయాల్సి ఉండటంతో.. ట్రీట్మెంట్ కోసం 35 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వాహిని కుటుంబానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో వాహిని చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమైందని కరాటే కల్యాణి సోషల్మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఆమె తన పోస్ట్ లో ఇలా రాశారు. “అందరికీ నమస్కారం… ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు ఎలా మలుపుతిరుగుతుందో తెలియదు.
తెలుగులో ఎన్నో సినిమాలు, సీరియల్స్లో నటించిన పద్మక్క అలియాస్ వాహిని ప్రస్తుతం ప్రాణాంతక దశలో ఉంది. నెలలుగా రొమ్ము క్యాన్సర్తో పోరాడుతోంది. ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. అవయవాల పనితీరు కూడా తగ్గిపోయింది. ఆమెకు తక్షణ వైద్య సహాయం అత్యవసరం. మనందరం కలిసి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒక ప్రాణాన్ని కాపాడుకుందాం.” అని పోస్ట్ చేశారు.
ఇండస్ట్రీ పెద్దలతో పాటు.. అందరు స్పందించాలని కళ్యాణి కోరారు. అంతే కాదు వాహినికి సబంధించిన యూపీఐ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను కూడా ఆమె పోస్ట్ చేయడంతో.. వాహిని పరిస్థితి తెలిసి చాలామంది స్పందిస్తున్నారు. వారికి తోచ్చినట్టుగా సాయం చేస్తున్నారు. వాహిని కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
