షూటింగ్‌లో నటుడు రాజశేఖర్‌కు ప్రమాదం, ఆస్పత్రిలో డాక్టర్లు ఏమంటున్నారంటే..?

divyaamedia@gmail.com
1 Min Read

రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన ‘లబ్బర్ పందు’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన కాలి చీలమండకు గాయమైంది. పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. అనంతరం నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. పూర్తీ వివరాలోకి వెళ్తే టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారని సమాచారం. కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం నటుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళంలో విజయవంతమైన ‘లబ్బర్ పందు’ రీమేక్‌లో నటిస్తున్నారు రాజశేఖర్.

ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా, రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే సీనియర్ హీరో, హీరోయిన్లు రాజశేఖర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు . ఇప్పుడీ సినిమా షూటింగులో నే రాజశేఖర్ గాయపడ్డారని తెలుస్తోంది. ఆయన కాలి చీలమండకు గాయమైందని టాక్. పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు.

అనంతరం నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. రాజశేఖర్‌కు గాయం కావడంతో సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్రీకరణను తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *