అందమైన అమ్మాయితో హోటల్ లో గడిపే ఆఫర్, యువకుడు హోటల్ కి వెళ్ళగానే ఏం జరిగిందో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్, నెట్‌వర్క్ లేదా డిజిటల్ పరికరాలను ఉపయోగించి చేసే నేరపూరిత కార్యకలాపాలు. ఇందులో వ్యక్తిగత, ఆర్థిక లేదా భద్రతాపరమైన నేరాలు ఉంటాయి. అయితే యాకూత్‌పురాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ‘పెయిడ్ సర్వీస్’ పేరుతో కనిపించిన నకిలీ ప్రొఫైల్‌ను నమ్మి మొత్తం రూ.1,02,093లు కోల్పోయాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. స్కామర్‌ చాలా తెలివిగా బాదితుడ్ని బుట్టలో వేసుకున్నాడు. కళ్లు చెదిరే ఫోటోలు పెట్టాడు.. ఫేక్ రివ్యూలతో సర్వీస్ అదుర్స్ అన్నట్లు బిల్డప్ ఇచ్చుకున్నాడు. ఎడిట్ చేసిన చాట్ స్క్రీన్‌షాట్లు చూపించి తమ సర్వీస్‌ నిజమని నమ్మబలికాడు. తర్వాత అడ్వాన్స్, సెక్యూరిటీ, రూమ్ బుకింగ్, రిఫండబుల్ ఛార్జీలు అంటూ వరుస పేమెంట్స్ చేయించాడు.

బాధితుడు యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ల ద్వారా అనేక ఖాతాలకు మొత్తం రూ.1.02 లక్షలు పంపేశాడు. డబ్బులు పంపిన తర్వాత ‘అబిడ్స్‌లోని హోటల్‌కు రావాలి’ అంటూ మెసేజ్‌ పంపడంతో బాధితుడు అక్కడికి వెళ్లాడు. అయితే అక్కడ ఎవరూ రాకపోవడంతో మోసపోయినట్టు తెలిసింది. ఇదే సమయంలో స్కామర్‌ మరో రూ.10,000 ఇవ్వాలని బెదిరించడంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టెలిగ్రామ్, వాట్సాప్‌లలో కనిపించే ‘పెయిడ్ కంపానియన్‌షిప్’ ప్రొఫైల్‌లు అన్నీ మోసపూరితమే అని స్పష్టం చేశారు. స్కామర్లు ఫేక్ ఫొటోలు, నకిలీ రివ్యూలు, ఎడిటెడ్ స్క్రీన్‌షాట్లు ఉపయోగిస్తారని.. ప్రజలు ఎలాంటి తెలియని ప్రొఫైల్‌లను నమ్మరాదని సూచించారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *