కారు ఓనర్ పుల్వామా నివాసి, ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..!

divyaamedia@gmail.com
2 Min Read

నగరం మధ్యలో సంభవించిన ఒక అనూహ్యమైన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సాధారణంగా కనిపించిన ఓ కారు ఒక్కసారిగా చెల్లాచెదురైపోయింది. ఆ క్షణం నల్లటి పొగ ముసురుకుంటూ రోడ్డంతా గందరగోళమైంది. అయితే ఈ పేలుడు ఏ రకం అనేది ఇప్పటికీ స్పష్టంగా లేదు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది.. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది.

పేలుడు ధాటికి 9 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం సరిగ్గా 6.52నిమిషాలకు పేలుడు సంభవించింది. స్పాట్‌లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థంకాలేదు కానీ, భారీ పేలుడు జరిగినట్లు అర్థమయింది. వెంటనే ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ, చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. పేలుడులో అమోనియం నైట్రేట్‌ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పేలుడు జరిగిన కారు హర్యానాలో రిజిస్టర్‌ అయినట్టు గుర్తించిన పోలీసులు.. కారు యజమానిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. బాంబు పేలుడు జరిగిన కారు చివరి యజమాని పుల్వామా వాసి తారిక్‌గా గుర్తించారు. NSG కమాండోలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో ఉగ్రవాద ఆత్మహుతి దాడిగా భావిస్తున్నారు. దీనిపై భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎర్రకోట మెట్రోస్టేషన్‌ దగ్గర CCTV ఫూటేజీ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాయి దర్యాప్తు బృందాలు.

ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుడు జరిగిన కారు నుంచి ఆధారాలు సేకరించి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపింది ఫోరెన్సిక్ బృందం. అయితే.. వైట్ హ్యుందాయ్ ఐ20 కారుకు సంబంధించి సీసీటీవీ వీడియోను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మూలాల ప్రకారం, HR 26CE7674 నంబర్ ప్లేట్‌తో ఉన్న వాహనం ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటలకు పైగా నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరింది.

దాదాపు ఒక నిమిషం నిడివి గల క్లిప్‌లో కారు బదర్‌పూర్ సరిహద్దులోకి ప్రవేశించినట్లు చూపిస్తుంది.. పోలీసులు ఆ మార్గాన్ని పరిశీలిస్తున్నారని వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి బాంబర్ చేయి కిటికీపై ఉంచి కారు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశిస్తున్నట్లు ఒక చిత్రం చూపిస్తుంది. ఆ కారు డ్రైవర్ నీలం, నలుపు రంగు టీ-షర్టు ధరించి ఉన్నట్లు చెబుతున్నారు. కారు పార్క్ చేసిన తర్వాత అనుమానిత ఆత్మాహుతి బాంబర్ ఒక్క క్షణం కూడా కారు నుంచి దిగలేదని వర్గాలు తెలిపాయి.

అతను ఎవరికోసమో వేచి చూస్తున్నాడని లేదా పార్కింగ్ స్థలంలో సూచనల కోసం ఎదురు చూస్తున్నాడని వారు తెలిపారు. హ్యుందాయ్ ఐ20 కారు యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్.. ఆత్మాహుతి బాంబర్ అని అధికారులు అనుమానిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *