విజయ్-రష్మిక ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ న్యూస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది. సోషల్ మీడియా మొత్తం ఈ న్యూస్ తోనే షేక్ అయ్యింది. కానీ, విజయ్ నుంచి గానీ, రష్మిక నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగని, ఎవరు ఖండించలేదు కూడా.
దాంతో, ఈ వార్తలు నిజమే అంటూ ఫిక్స్ అయిపోయారు అంతా. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కటి కానున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరలవుతోంది. 26వ తేదీన విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని ఇందులో ఉంది. అలాగే రాజస్థాన్ ఉదయ్పూర్లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్కు వేదిక కానుందని ఒక వార్త హల్ చల్ చేస్తోంది.
మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక మందన్నా తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన చేతికి ఉన్న రింగ్స్ లో ఒకటి చాలా స్పెషల్ అని చెప్పింది. ఈ విషయంలో జనాలు ఏమనుకున్నా తనకు సంతోషమేనంది. తద్వారా విజయ్ తో తనకు నిశ్చితార్థం జరిగినట్లు చెప్పకనే చెప్పింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే థామ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది రష్మిక. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ అనే మరో కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు.
