మోకాళ్లపై తిరుమల శ్రీవారి కొండ ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్. ఎవరో గుర్తు పట్టారా..?

divyaamedia@gmail.com
2 Min Read

స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దర్శనానంతరం ఆలయం ఎదుట ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా భక్తులు కూడా వారితో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. సురేఖ వాణి, సుప్రిత తిరుమల పర్యటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తీ వివరాలోకి వెళ్తే ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా మోకాళ్లపై నడుస్తూ తిరుమల కొండను చేరుకుంది.

అనంతరం శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఈ హీరోయిన్ దైవభక్తికి ఫిదా అవుతున్నారు. మరీ ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సుప్రీత.. అదే నండి సీనియర్ నటి సురేఖా వాణి కూతురు.

సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఏడాదిలో కనీసం రెండు, మూడుసార్లయినా ఇక్కడకు వస్తుంటారు తల్లీ కూతుళ్లు. అలా లేటెస్ట్ గా మరోసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు సురేఖా వాణి, సుప్రిత. అయితే ఈసారి సుప్రిత మాత్రం మోకాళ్లపై నడుస్తూ వెళ్లి మరీ ఏడుకొండల వాడిని దర్శించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా సహాయక నటిగా వందలాది సినిమాల్లో నటించిన సురేఖా వాణి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

అయితే ఆమె కూతురు సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా పరిచయం కానుంది. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ చౌదరి హీరోగా తెరకెక్కుతోన్న ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటు మరో సినిమాకు కూడా సైన్ చేసిందీ స్టార్ కిడ్ . త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *