యుజ్వేంద్ర చహల్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి 2024లో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 2025లో కోర్టు వీరి విడాకుల దరఖాస్తును ఆమోదించింది. నివేదికల ప్రకారం, ధనశ్రీ వర్మకు చహల్ నుంచి 4.75 కోట్ల రూపాయల భరణం లభించినట్లు తెలుస్తోంది. అయితే దుబాయ్లో జన్మించినప్పటికీ, ధనశ్రీ వర్మ భారతదేశంలోనే పెరిగారు.
ఆమె డెంటల్ డాక్టరీ పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, కొరియోగ్రాఫర్గా రాణిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, యుజ్వేంద్ర చాహల్తో విడాకుల తర్వాత ధనశ్రీ వర్మ నికర విలువ దాదాపు రూ. 25 కోట్లకు చేరుకుంది. ధనశ్రీ నెలవారీగా రూ. 15 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య సంపాదిస్తుందని అంచనా. ఈ ఆదాయం ఆమెకు వచ్చే బ్రాండ్ ఎండార్స్మెంట్లు, పెయిడ్ ప్రమోషన్లపై ఆధారపడి ఉంటుంది.

విడాకులు తీసుకునే సమయంలో ఇన్స్టాగ్రామ్లో 5.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ధనశ్రీకి, ఇప్పుడు 6 మిలియన్ల ఫాలోవర్లు దాటారు. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ధనశ్రీ వర్మ అష్నీర్ గ్రోవర్ షో అయిన రైజ్ అండ్ ఫాల్లో పాల్గొంటూ, అక్కడ తన వ్యక్తిగత జీవితం, చాహల్తో తన బంధం గురించి పలు విషయాలను వెల్లడిస్తున్నారు. భారత క్రికెట్లో చాహల్ ఒక ప్రముఖ ముఖం.
ఇన్స్టాగ్రామ్లో అతనికి 10.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం, యుజ్వేంద్ర చాహల్ నికర విలువ దాదాపు రూ. 45 కోట్లుగా ఉంది. భారత జట్టు నుంచి తాత్కాలికంగా దూరంగా ఉన్నప్పటికీ, చాహల్ ఆదాయం ప్రధానంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, ఐపీఎల్ జీతం, వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్లు, పెట్టుబడుల ద్వారా వస్తుంది. చాహల్, ధనశ్రీ విడిపోయిన తర్వాత కూడా తమ వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్గా మాట్లాడటం, వారి వృత్తిపరమైన ఎదుగుదల వార్తల్లో నిలుస్తున్నాయి.