విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న స్టార్ హిరోయిన్. ఇప్పుడు ఎలా ఉందొ..?

divyaamedia@gmail.com
1 Min Read

90వ దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ నటించి.. తన నటనతో మెప్పించింది. హీరోయిన్ కాకముందు చైల్డ్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాలలో నటించిన ఈమె.. చిన్నప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైంది. భద్రంకొడుకో సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ లయ.

ఆ తర్వాత వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది. అయితే టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది. గురువారం విజయవాడ వచ్చిన ఆమె కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారికి మొక్కులు చెల్లించిన లయ ఆలయ సిబ్బంది, భక్తులతో సరదాగా ఫొటోలు దిగింది. తన ఇంద్రకీలాద్రి యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు సినిమాలో ఝాన్సీ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించింది లయ. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి చేయలేకపోయింది.

దీంతో రీఎంట్రీలో లయకు ఆశించిన శుభారంభం దక్కలేదు. లయ ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *