హీరోయిన్ రాధిక ఇంట్లో తీవ్ర విషాదం, అసలు ఏం జరిగిందో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

గీత మృతితో రాధికా ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు, ఇండస్ట్రీ పెద్దలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీ, సామాజిక వర్గాల కోసం గీత ఎంతగానో కృషి చేశారు. అయితే సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గీత మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దివంగత సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధా భార్య.

తమిళ చిత్ర పరిశ్రమ, సామాజిక వర్గాలకు ఆమె ఎంతో కృష్టి చేశారు. గీత అంత్యక్రియలు సోమవారం, 22 సెప్టెంబర్ 2025 సాయంత్రం 4.30 గంటలకు బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. శ్రీమతి గీతా రాధ తన జీవితాన్ని కుటుంబానికి, ప్రేమను ప్రజలకు అంకితం చేశారు.

వెనుకబడిన ప్రాంతాలలో అనేక సామాజిక సేవలకు కూడా ఆమె దోహదపడింది. నటుడు ఎం.ఆర్. రాధ వారసత్వాన్ని కొనసాగించడంలో, కుటుంబాన్ని నడిపించడంలో సామాజిక సేవ చేయడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె మృతి పట్ల అనేక మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *