చావు వస్తుందని శరీరంలోని ఈ భాగానికి ముందే తెలుస్తుంది. ఎలానో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఒక వ్యక్తి తన జీవితంలో తాను చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాడు. మనిషి చనిపోయిన తర్వాత కూడా తన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. గరుడ పురాణంలో కూడా ఇలాంటి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. దీని కారణంగా ఒక వ్యక్తి తన మరణం గురించి ముందస్తు సూచన పొందుతాడు. మన శరీరాల్లో మార్పులు రాబోయే ఆరోగ్య ప్రమాదాల గురించి ముందస్తు హెచ్చరిక సంకేతాలను అందిస్తాయి.

ముఖ్యంగా, వాసన కోల్పోవడం అంత తేలికైన సమస్య కాదు. ఇటీవలి అధ్యయనాలు దీనిని మరణాన్ని అంచనా వేసేదిగా గుర్తించాయి. PLOS One జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వాసన చూసే శక్తి తగ్గిన వ్యక్తి 5 సంవత్సరాలలోపు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 57 నుండి 85 సంవత్సరాల వయస్సు గల 3,000 మంది పురుషులు, స్త్రీలపై ఈ అధ్యయనం నిర్వహించబడింది.

పాల్గొనేవారికి ఐదు సాధారణ వాసనలు – గులాబీ, పుదీనా, తోలు, నారింజ, చేప వాసనలు గుర్తించడానికి ఒక పరీక్ష పెట్టారు.. ఈ పరీక్ష వారి ముక్కు ఎంత బలంగా ఉందో చెబుతుంది. ఐదు సంవత్సరాల తర్వాత, 12శాతం మంది మరణించారు. వీరిలో 39శాతం మంది వాసన పరీక్షలో పూర్తిగా విఫలమయ్యారు. 19శాతం మందికి పాక్షికంగా వాసన గ్రహణశక్తి ఉంది. 10శాతం మందికి మాత్రమే పూర్తి వాసన గ్రహణశక్తి ఉంది.

అధ్యయనం ప్రకారం, వాసన గ్రహించని వారికి ఇతరుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ మరణ ప్రమాదం ఉందని అధ్యయనం వెల్లడించింది. ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. న్యూరోడీజెనరేటివ్ వ్యాధులు.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులు మెదడులోని ఘ్రాణ భాగాన్ని దెబ్బతీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ వైఫల్యం.. ఇది ఇన్ఫెక్షన్లు, మెదడు, శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

పోషకాహార లోపం.. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వృద్ధాప్యం.. వయస్సుతో పాటు వాసన చూసే శక్తి సహజంగా తగ్గుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, నాసికా వాసన పరీక్షను కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో చేర్చాలి. తద్వారా నాడీ సంబంధిత వ్యాధులు లేదా ఇతర ప్రమాదాలను ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *