పిల్లలకు పాలు పడుతోన్న స్టార్ హీరోయిన్, ఆ పిల్లలు ఎవరో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

శ్రీనిధి శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకొని 2018లో కె.జి.యఫ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. అయితే ప్రస్తుతం మరో టాలీవుడ్ క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ తో కలిసి తెలుసు కదా అనే మూవీలో నటిస్తోందీ అందాల తార.

ఇందులో శ్రీనిధితో పాటు రాశీ ఖన్నా మరో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూ వీ షూటింగ్ లో బిజీగా ఉంటోంది శ్రీనిధి. కాగా మిగతా హీరోయిన్లతో పోల్చితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటుందీ అందాల తార. ఎప్పడో ఒకసారి తన ఫొటోలు షేర్‌ చేస్తుంటుంది. తన వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

అయితే తాజాగా శ్రీనిధి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో ఆమె బాబును లాలిస్తూ పాలు పట్టింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు కాసేపు గందరగోళంలో పడ్డారు. ఏంటీ? శ్రీనిధికి పిల్లలు ఉన్నారా? పెళ్లి ఎప్పుడైందని సందేహాలు లేవనెత్తారు. అయితే శ్రీనిధి షేర్ చేసిన పోస్ట్ పూర్తిగా చూశాక అసలు విషయం అర్థమైంది. ఇంతకీ ఆ పిల్లలు ఎవరంటే ఆమె సోదరుడి పిల్లలు.

పిల్లలతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘ఇది నేను నిద్ర లేచినప్పుడు. లేచేసరికి నా పిల్లలు ఇలా నా పక్కనే ఉన్నారు. నాకు తెలుసు. నేను ఉత్తమ అత్త అని. ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను’ అంటూ తన పోస్ట్‌ కి క్యాప్షన్ రాసుకొచ్చిందీ అందాల తార.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *