హీరోయిన్ పూజా దద్వాల్.. జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఒకరోజు సడన్గా వీక్నెస్తో కిందపడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా తనకు టీబీ ఉందని తెలిసింది. ఈ విషయం తెలియగానే ఆమె భర్త, అత్తామామ తనను వదిలించుకోవాలని చూశారు. ముంబైలో వదిలేశారు. కన్నవాళ్లు, స్నేహితులు.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే తన తొలి సినిమాతోనే సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసే అవకాశం లభించింది.
కానీ ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. 17 ఏళ్ల వయసులో పూజా దద్వాల్ 1995లో సల్మాన్ ఖాన్ చిత్రం ‘వీర్గతి’లో అరంగేట్రం చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆమె అవకాశాల కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘ఆషికి’ (1999) తర్వాత ‘ఘరానా’ (2001) చిత్రంలో కనిపించింది.

ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ పూజాకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. వివాహం తర్వాత పూజా గోవాలో నివసించింది. కొన్నేళ్లుగా సినీరంగానికి దూరంగా ఉన్న పూజా.. 2018లో టిబి బారిన పడి ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పూజ గోవాలోని ఒక క్యాసినోలో మేనేజర్గా పనిచేస్తూ, చికిత్స కోసం ముంబైకి వచ్చింది. ఆమెకు టీబీ వ్యాధి ఉందని తెలియడంతో కుటుంబం దూరం పెట్టింది.
ఆమె గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్.. సంవత్సరంపాటు ఆమె చికిత్స, ఆహర ఖర్చులన్నింటినీ భరించారు. అలాగే నటుడు రవి కిషన్ సైతం ఆమెకు సహాయం చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పూజాకు ఉండేందుకు ఇల్లు లేదు. దీంతో ముంబైలోని మురికివాడలలో నివసించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఆమెను ఓ ఇంట్లో అద్దెకు ఉండి ఆమె ఖర్చులను భరించారు. ఇప్పటికీ ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.