బాలీవుడ్ హీరోయిన్లు అది కూడా 40 ఏళ్లు దాటిన దీపికా పదుకునే లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక సౌత్ తో నయనతార, త్రిష, సమంత లాంటి సీనియర్ తారలు కూడా 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాు. ఈక్రమంలో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ SSMB29లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆమె దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఒక హీరోయిన్కు చెల్లించిన అత్యధిక రెమ్యునరేషన్గా నిలిచింది. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు తీసుకునే వాటిలో 20 శాతం కూడా హీరోయిన్లకు ఇవ్వరు.

కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. హీరోయిన్లు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా వారి స్థాయిని బట్టి అడిగినంతా ఇచ్చేందుకు సై అంటున్నారు. సౌత్ లో కూడా హీరోయిన్ల రెమ్యునరేషన్ 10 కోట్లు దాటింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ‘కల్కి 2898 AD’ సినిమాలో నటించి రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. ఆలియా భట్ ఒక్కో సినిమాకు సుమారు రూ.15 కోట్లు అందుకుంటుండగా, కరీనా కపూర్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, నయనతార, సమంత తదితరులు రూ.10 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు వెళ్ళక ముందు కూడా భారీగా ఆస్తులు కూడబెట్టింది. ఇక అక్కడికి వెళ్లిన తరువాత కూడా చేతి నిండా సంపాదిస్తుంది గ్లోబల్ బ్యూటీ. ప్రస్తుతం ప్రియాంక ఆస్తుల విలువ 700 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఆమె భర్త, ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ నెట్వర్త్ సుమారు రూ.666 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇక వీరిద్దరి ఆస్తులు కలుపుకుని 1300 కోట్ల వరకూ ఉంటాయి.ఇలా చూసుకుంటే ఆస్తి పరంగా కూడా ప్రియాంక చోప్రా ఇండియాన్ హీరోయిన్లు అందుకోలేని స్థాయిలో ఉంది. అందుకే ఆమె గ్లోబల్ స్టార్ గా మారిపోయింది.