రెడ్ లైట్ ఏరియాలో పుట్టి.. ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి.. చివరి రోజుల్లో ఎంత ఘోరంలో చనిపోయిందో తెలుసా..?

divyaamedia@gmail.com
3 Min Read

గౌహార్ జాన్ భారతీయ సంగీత విద్వాంసురాలు, నాట్య కళాకారిణి. ఆమె అసలు పేరు ఏంజలినా యోవార్డ్. కలకత్తాకు చెందిన ఈమె, భారతదేశంలో 78rpm లో రికార్డులో పాట పాడిన అతికొద్ది మందిలో గుహార్ ఒకరు. అయితే ఇప్పటి సింగర్స్‌ ఒక్క పాట పాడటానికి రూ.లక్షల్లో, ఒక కన్సర్ట్‌కు రూ.కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు. అయితే గతంలో వందల రూపాయలకే రికార్డింగ్ చేసే రోజుల నుంచి కేవలం పాటలు పాడి కోటీశ్వరురాలైన ఒక సింగర్‌ ఉందంటే నమ్ముతారా? ఆమె ఇండియన్‌ ఫస్ట్‌ సింగింగ్‌ సూపర్‌ స్టార్‌, ‘గ్రామ్‌ఫోన్ గర్ల్’గా పాపులర్ అయిన గౌహర్ జాన్.

1873 జూన్ 26న జన్మించిన గౌహర్ జీవితం.. కష్టాల నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఒక అద్భుతమైన జర్నీ. ఆమె పది వేర్వేరు భాషల్లో 600కు పైగా పాటలు పాడి ఇండియాలోనే కోటీశ్వరురాలైన ఫస్ట్‌ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అసలు పేరు ఏంజెలీనా.. గౌహర్ జాన్ అజంగఢ్‌లో అర్మేనియన్ మూలాలున్న ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు ఏంజెలీనా యోవర్డ్. ఆమె తండ్రి రాబర్ట్ విలియం యోవర్డ్ ఒక ఇంజనీర్. ఆమె నాయనమ్మ హిందువు. తాత బ్రిటిష్. తండ్రి అర్మేనియన్ క్రైస్తవుడు. 1879లో గౌహర్‌కు ఆరేళ్ళ వయసులో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు.

ఏంజెలీనా, ఆమె తల్లి విక్టోరియా ఇద్దరూ చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత, విక్టోరియా.. ఖుర్షిద్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. విక్టోరియా ఇస్లాంలోకి మారి మల్కా జాన్‌గా మారింది. అప్పుడే ఏంజెలీనా పేరును గౌహర్ జాన్‌గా మార్చారు. మల్కా జాన్ ఒక ప్రముఖ సింగర్‌గా మారింది. 1883లో ఆమె కలకత్తాకు మారింది. మూడు ఏళ్లలోనే ఆమె తన సొంత వేశ్యా గృహాన్ని కొనుగోలు చేసింది అక్కడే గౌహర్ పెరిగింది. మ్యూజిక్‌ నేర్చుకుంది. గౌహర్ అందమైన, టాలెంటెడ్‌, సెన్సిటివ్‌ మహిళ. 1888లో గౌహర్ తన ఫస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. ఆమెను దర్భంగా రాజు రాజభవనంలో కోర్ట్ మ్యుజీషియన్‌గా నియమించాడు.

1896లో ఆమె కలకత్తాలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఇస్లాంను స్వీకరించిన తర్వాత గౌహర్ జీవితాంతం అల్లా భక్తురాలిగా కొనసాగింది. అయినప్పటికీ ఆమె శ్రీకృష్ణుడిపై అనేక స్వరాలను సమకూర్చింది. 20వ శతాబ్దం స్టార్టింగ్‌లో ఇండియాలోని బెస్ట్‌ సింగర్స్‌లో గౌహర్ జాన్ ఒకరు. గ్రామ్‌ఫోన్ కోసం పాటలు రికార్డ్ చేయడానికి ఆమె యాక్సెప్ట్‌ చేసినప్పుడు ఓ పెద్ద సెన్సేషన్‌ అయ్యింది. ఆమె శాస్త్రీయ గానాన్ని 2-3 నిమిషాల పాటలుగా మార్చారు. చాలా తక్కువ సమయంలోనే అవి విపరీతంగా అమ్ముడుపోయాయి. దశాబ్దం చివరి నాటికి గౌహర్ ఒక్కో రికార్డింగ్‌కు రూ.1,000-3,000 వసూలు చేసింది.

ఆ రోజుల్లో చాలా ఫ్యామిలీస్‌ యాన్యువల్‌ ఇన్‌కమ్‌ కంటే ఇది చాలా ఎక్కువ. 1911లో కింగ్ జార్జ్ V పట్టాభిషేక వేడుకలో ఢిల్లీ దర్బార్‌లో ప్రదర్శన ఇవ్వడానికి గౌహర్ జాన్‌కు ఇన్విటేషన్‌ అందింది. ఈ గౌరవం అలహాబాద్‌కు చెందిన జానకీబాయి అనే మరో సింగర్‌కు మాత్రమే లభించింది. అద్భుతమైన ఆ వేడుకలో రాజు, రాణి ఇండియాలోని రాజ కుటుంబాలన్నీ హాజరయ్యాయి. కన్సర్ట్‌ తర్వాత గౌహర్‌ను రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు ఆమె టాలెంట్‌ను ప్రశంసించారు. తన ప్రశంసకు గుర్తుగా వంద గినియాస్‌ను బహుకరించారు. దీంతో రాజ వంశాలకు చెందని తొలి రిచెస్ట్‌ మహిళగా పేరుగాంచింది.

ఒకసారి ఆరోగ్యం బాలేకపోవడంతో గౌహర్ జాన్ మైసూరుకు వెళ్లింది. మైసూరులో ఉన్నప్పుడు అప్పటి రాజు కృష్ణరాజ వాడియార్ IV ఆమెను ప్యాలెస్ మ్యుజీషియన్‌గా నియమించారు. ఆమె తన చివరి రోజుల్లో తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడింది. గౌహర్ జాన్ 1930లో 56 ఏళ్ల వయసులో మైసూరులోనే మరణించింది. ఆ టైమ్‌లో ఆమె తన సంపదనంతా అలాగే విడిచిపెట్టారని ఆశించి.. చాలా మంది వారసులు ముందుకు వచ్చారు. కానీ గౌహర్ జాన్ తన జీవితంలోని చివరి దశాబ్దంలో తన డబ్బునంతా ఖర్చు చేసినట్లు తేలింది. ఆమె చనిపోయే నాటికి ఆమె వద్ద ఏమీ లేదు. గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా కోసం ఆమె చేసిన రికార్డింగ్‌లు ఆమెకు ‘గ్రామ్‌ఫోన్ గర్ల్’ అనే మారుపేరును సంపాదించి పెట్టాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *