వ్యక్తిగత జీవితం ఎలా ఉన్న కెరీర్ పరంగా మాత్రం దూసుకుపోతున్నారు నాగచైతన్య. రీసెంట్ గా తండేల్ రూపంలో భారీ సక్సెస్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం తదుపరి సినిమాల పనుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే చైతూ 25వ సినిమాకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు సమంత, చైతన్య. ఇక విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు.
సమంత మాయోసైటిస్ బారిన పడటంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. మరో వైపు నాగ చైతన్య తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే శోభిత దూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు. శోభిత, నాగ చైతన్య కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ సమంత, నాగచైతన్య, శోభిత కలిసి ఓ సినిమాలో నటించారని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఆ సినిమా ఎదో తెలుసా.? కల్ట్ క్లాసిక్ గా నిలిచినా మజిలీ. శివ నిర్వాణం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ముందుగా దివ్యాంక కౌశిక్ పాత్రకు శోభితను అనుకున్నాడట దర్శకుడు. శోభితతో రెండు మూడు సీన్స్ కూడా షూట్ చేశారట.. ఆతర్వాత కొన్ని కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది.
దాంతో ఆమె ప్లేస్ లోకి దివ్యాంక కౌశిక్ ను తీసుకున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో. అలాగే ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది.