జీనత్ అమన్ 1951లో బాంబేలో జన్మించింది. చిన్న వయసులోనే మోడల్గా సక్సెస్ అయ్యి, 1970ల్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జీనత్ తండ్రి ముస్లిం కాగా, తల్లి మహారాష్ట్రియన్ బ్రాహ్మిన్. నటుడు రజా మురాద్ ఈమె కజిన్. అయితే, 13 ఏళ్ల వయసులో తండ్రి మరణించడంతో, జీనత్ తల్లి జర్మన్ వ్యక్తి హింజ్ని పెళ్లి చేసుకుని ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకుంది. అయితే జీనత్ అమన్ తల్లి వర్ధినీ సింధియా తన కూతురి సక్సెస్కి బ్యాక్బోన్. హస్బెండ్, స్క్రీన్ రైటర్ అమానుల్లా ఖాన్తో విడిపోయాక, వర్ధినీ సింగిల్గానే జీనత్ను పెంచింది.
ఆమెకు మంచి చదువు చెప్పించడానికి చాలా కష్టపడింది. జీనత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, వర్ధినీ తన జాబ్ మానేసి, ఫుల్ టైమ్ మేనేజర్గా మారింది. జీనత్ కాంట్రాక్టులు, ఫైనాన్షియల్ మేటర్స్, యాక్టింగ్ విషయంలో గైడెన్స్ కూడా తనే చూసుకునేది. ఆమె డెడికేషన్ జీనత్ను బాలీవుడ్ టాప్ స్టార్స్లో ఒకరిగా నిలబెట్టింది. కానీ, జీనత్ లైఫ్లోకి వచ్చిన అబ్బాయిల్ని వర్ధినీ ఎప్పుడూ నమ్మలేదు, ఎవరూ తన కూతురికి సెట్ కారని ఆమె ఫీల్ అయ్యేది. ఇదే వాళ్లిద్దరి మధ్య చాలా కాలంగా టెన్షన్కి కారణమైంది.

1985లో, జీనత్ తన తల్లి మాట వినకుండా, యాక్టర్ మజార్ ఖాన్ ను సింగపూర్లో సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. ఈ న్యూస్ విని ఆమె తల్లి గుండె బద్దలైంది. పాపం, ఆ పెళ్లి ఒక రాంగ్ డెసిషన్ అయిపోయింది. ఏడాది తిరిగేలోపే, ఆ రిలేషన్ వర్కవుట్ కాదని జీనత్కు అర్థమైంది. ఆమె మొదటి బిడ్డకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ‘స్టార్డస్ట్’ మ్యాగజైన్ ద్వారా మజార్కు వేరే ఎఫైర్ ఉందని తెలుసుకుంది. ఈ మోసం తెలిశాక కూడా, జీనత్ ఆ రిలేషన్షిప్లోనే ఉండిపోయింది. పుట్టబోయే బిడ్డ కోసం, ఆ తర్వాత మజార్కి హెల్త్ సీరియస్ అవ్వడంతో అలా చేసింది.

ఐదేళ్లపాటు ఆమె మజార్కి సేవ చేసింది. ఇంజెక్షన్లు ఇవ్వడం, మెడికల్ బ్యాగ్స్ మార్చడం, హాస్పిటల్కి తిరగడం లాంటివి చేసింది. ఆ స్ట్రెస్ ఆమెను మెంటల్గా చాలా దెబ్బతీసింది. 1998లో మజార్ చనిపోయాక, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను అంత్యక్రియలకు రానివ్వలేదు, ఆస్తిలో ఎలాంటి షేర్ ఇవ్వలేదు. ఆమెకు ఏమీ మిగల్లేదు. మజార్తో పెళ్లికి ముందు, జీనత్ యాక్టర్ సంజయ్ ఖాన్తో రిలేషన్షిప్లో ఉంది, అది ఒక ట్రాజెడీతో ఎండ్ అయింది. 1978లో, అతను ఒక హోటల్లో ఆమెపై దారుణంగా ఎటాక్ చేసి, కంటికి పెద్ద దెబ్బ తగిలించాడు.

కొన్నేళ్ల తర్వాత, ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, సంజయ్తో ఇంకా రిలేషన్ కంటిన్యూ చేస్తోందనే రూమర్స్ వచ్చాయి, కానీ ఆమె వాటిని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు, దిలీప్ కుమార్ మేనకోడలు రుబైనాతో మజార్కి ఎఫైర్ ఉందన్న ఆరోపణలు, అప్పటికే ప్రాబ్లమ్స్లో ఉన్న జీనత్ లైఫ్ని ఇంకా బాధపెట్టాయి. మజార్ను పెళ్లి చేసుకోవడం తన లైఫ్లో చేసిన పెద్ద తప్పుల్లో ఒకటని ఆమె తర్వాత ఒప్పుకుంది.