రింకూ సింగ్, ఎంపీ ప్రియా పెళ్లి క్యాన్సిల్..! అసలు కారణం ఏంటో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

రింకు సింగ్, ప్రియా సరోజ్ వివాహం ఈ ఏడాది నవంబర్ 19న జరగాల్సిన ఉండగా.. క్రికెట్ సిరీస్‌ల కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ వార్తాపత్రిక కథనం ప్రకారం రింకూ సింగ్ రాబోయే కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉండనున్నాడు. అయితే నవంబర్ 18న వారణాసిలోని హోటల్ తాజ్‌లో వివాహం జరగాల్సి ఉంది.

హోటల్‌లోని అతిథుల కోసం గదులు మొదలైనవి కూడా బుక్ చేశారంట. రింకు సింగ్ అక్టోబర్, ఫిబ్రవరి మధ్య రాష్ట్ర జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి చివరిలో అతనికి ఆట నుంచి సమయం దొరికినప్పుడు లేదా ఐపీఎల్ 2026 తర్వాత వివాహ తేదీని నిర్ణయిస్తారని ఇరు కుటుంబాలు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రెండు కుటుంబాలు కూడా వివాహం వారణాసిలో కాకుండా వేరే ప్రదేశంలో జరగాలని, ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థానికి భారీగా అతిథులు..ప్రియా సరోజ్, రింకు సింగ్ ల నిశ్చితార్థ వేడుకకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, జయా బచ్చన్ సహా పలువురు కీలక అతిథులు హాజరయ్యారు.

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, పలువురు క్రికెటర్లు కూడా హాజరయ్యారు. రింకు సింగ్ తన వేలికి ఉంగరం పెట్టినప్పుడు ప్రియా సరోజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె నిరంతరం కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది. నిశ్చితార్థం తర్వాత రింకు సింగ్ తొలిసారి తన అత్తమామల ఇంటికి చేరుకున్నప్పుడు, ఆయనకు ఘన స్వాగతం లభించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *