జీడిమెట్లలోని ఎన్ఎల్బీ నగర్లో ఈ దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీకి.. నల్లగొండకు చెందిన పగిల్ల శివ (19) అనే యువకుడితో 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసుకుంది. డీజే ప్లేయర్ అయిన శివ – తేజశ్రీ ఫోన్లు, మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయారు. పూర్తీ వివరాలోకి వెళ్తే జీడిమెట్లకు చెందిన బాలిక స్థానికంగా పదో తరగతి చదువుతోంది. ఆమెకు శివ (19) అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసుకుంది. ఇద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోయారు. ఫోన్లు, మెసేజ్లతో పాటు చెట్టాపట్టాలేసుకొని తిరగటం ప్రారంభించారు. ఈ విషయం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని… బాగా చదువుకోవాలని కూతురిని మందలించింది. దీంతో తల్లిపై బాలిక పగ పెంచుకుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది.
ఇద్దరూ కలిసి తల్లి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన సోదరుడు యశ్వంత్ సహాయం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేసారు. గొంతు నులుమి, తలపై రోడ్డుతో మోది హత్య చేశారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.