ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో స్టార్ హీరో ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చుస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ అందించిన నటుడలు కాంతారావు కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీనిపై ఆయన కుమారుడు రాజా తెలంగాణ ప్రభుత్వానికి ఓసారి విజ్ఞప్తి చేశారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, అద్దె ఇంట్లో జీవిస్తున్నామని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కాంతారావు శత జయంతి ఉత్సవాల్లో రాజా పాల్గొన్నారు. ‘‘నా తండ్రి శత జయంతి వేడుకల్లో పాల్గొవడం ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకుని మరీ సినిమాలు తీశారు. దానివల్ల్ల మేము ఆర్థికంగా నష్టపోయాం.

నాన్న క్యాన్సర్‌ బారిన పడినప్పుడు చికిత్స నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేశాం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నగర శివార్లలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవితం సాగిస్తున్నాం. ఇన్ని కష్టాల్లో ఉన్న మాకు ఇండస్ట్రీ నుంచీ ఎలాంటి సాయం అందలేదు. మా కుటుంబానికి ఓ ఇల్లు కేటాయించి ఆదుకోవాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను’’ అని విజ్ఞప్తి చేశారు. ఇక కాంతారావు చనిపోయాక ఆయన కుటుంబ పరిస్థితి కూడా మరింత ఘోరంగా తయారైంది.

ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కాంతారావు కుమారుడు రాజేశ్వరరావుకి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసిన అవార్డుల్లో భాగంగా రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు యండమూరి వీరేంద్రనాథ్. అయితే పురస్కారం అందుకుంటోన్న సమయంలోనే బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని యండమూరి చెప్పారు.

అలా చెప్పినట్లుగానే ఇప్పుడు బహుమతి మొత్తంలో నుంచి లక్ష రూపాయలు కాంతారావు కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా తన ఇంటికి పిలిపించుకుని రూ.లక్ష చెక్కు అందజేశారు యండమూరి.అలాగే కడపకు చెందిన ఆర్తి ఫౌండేషన్‌కు రూ.3లక్షలు, శ్రీకాకుళంలో పేద, అనాథ విద్యార్థులకు సాయం చేసే అభయం ఫౌండేషన్‌కి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు వీరేంద్ర నాథ్. దీంతో ఈ దిగ్గజ రచయితపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *