వృత్తి రీత్యా ఆమె కుటుంబం పూసల దండలు అమ్ముకుని జీవించేది. కుంభమేళా టైంలో వ్యాపారం బాగా అవుతుందని ప్రయాగ్రాజ్ వచ్చారు. కుటుంబంతో కలిసి మోనాలిసా కూడా వచ్చింది. అలా వచ్చి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఆమె సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే మహాకుంభమేళ చాలా మంది జీవితాల్ని మార్చేసింది. పుణ్యం కోసంవెళ్లిన వారికి విశేషమైన పుణ్యం, బిజినెస్ కోసం వెళ్లిన వారికి వారి కలలో కూడా ఊహించని లాభాల్ని తెచ్చిపెట్టింది. కుంభమేళా పుణ్యామా.. చాలా మంది ఓవర్ నైట్ లో సెలబ్రీటీలుగా మారిపోయారు.
ఈ కోవలోనే మోనాలీసా కూడా వస్తుందని చెప్పుకొవచ్చు. కుంభమేళలో పూసలమ్మడానికి వచ్చిన ఈ యువతి కళ్లలో ఏదో మిరాకిల్ ఉందని కొంత మంది ఆమె ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఫెమస్ అయ్యిపోయింది. ఎంతగా ఫెమస్ అయ్యిందంటే.. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాదిగొచ్చి ఆమెకు తన సినిమాలో చాన్స్ ఇవ్వడమే కాకుండా.. ముంబైలో సినిమాల్లో నటించడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇప్పించాడు.

ఈ క్రమంలో కుంభమేళ బ్యూటీకి షాపింగ్ మాల్స్, పలు యాడ్స్ లలో అంబాసిడర్ గా ఉండాలని ఆఫర్ లు కూడా వచ్చాయి. అయితే.. ఆమె ప్రస్తుతం సనోజ్ మిశ్రాచేస్తున్న మణిపూరీ డైరీస్ లో హీరోయిన్గా చేస్తుంది. గతంలో కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. అయితే.. మోనాలీసా మాత్రం ఫుల్ బిజిగా ఉంటుంది. మోనాలీసా నటించిన ఫస్ట్ సాంగ్ సాద్ గి రిలీజైందది. దీనిలో కుంభమేళ బ్యూటీ పర్పామెన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
సింగర్ ఉత్కర్ష్ శర్మ పాటలో మోనాలీసా కెమెరా ముందు తొలిసారి అయిన ఎంతో మెచ్చూర్ గా నటించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే.. కుంభమేళ బ్యూటీ ప్రస్తుతం కోటీరూపాయల కారులో జర్నీ చేయడం పెద్ద చర్చగా మారింది. కుంభమేళలో రూ. వంద కోసం పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే మోనాలీసా.. ఈ రోజు కోటి రూపాయల కారులో జర్నీ చేయడం .. ఈ జర్నీకూడా కేవలం కొన్ని నెలల్లోనే అనేక మలుపులు తిరుగూతూ ఈ స్థాయికి చేరుకుంది.
మధ్యలో ఆమెను కొంత మంది ట్రోల్స్ చేసిన కూడా ప్రస్తుతం.. ఆమె కోటిరూపాయల కారులో జర్నీ చేయడం చూసిన నెటిజన్లు ఇది భయ్యా.. లక్ అంటే.. అంటూ మోనాలీసాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా కుంభమేళ మాత్రం మోనాలీసా జీవితాన్ని మార్చేసిందని బల్లగుద్ది మరీ చెప్పుకొవచ్చు.