ఆంధ్రప్రదేశ్, ఇబ్రహీంపట్నం కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్లో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడుతున్నారు. శ్రీవారి ఆలయం దగ్గరలో చెప్పులు వేసుకుని వెళ్తున్నారు. మరికొందరు తిరుమలలో రీల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఇలాంటి ఘటనపై సీరియస్ అయ్యింది.
శ్రీవారి సన్నిధిలో ఇలాంటి పనులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.అయిన కూడా తిరుమలలో కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రీటీలు తిరుమలలో రీల్స్ చేసుకుంటూ వివాదం రాజేశారు. జబర్దస్త్ రీతు చౌదరీ, బిగ్ బాస్ అఖిల్ లు ఇద్దరు తిరుమలలో రీల్స్ చేయడం పెద్ద దుమారంగా మారింది.
అయితే ఆ వీడియోలో… ఇద్దరు చూడటానికి సాంప్రదాయ దుస్తులు ధరించిన కూడా.. ప్రైవేటు పార్ట్స్ లు కన్పించేలా వారి డ్రెస్సింగ్ ఉంది. రీతు ధరించిన చీర కట్టు సైతం కావాలని ప్రైవేటు పార్ట్స్ లను ఎక్స్ పోజ్ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఇద్దరు కన్పిస్తున్నారని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఇద్దరు కూడా శ్రీవారి సన్నిధిలో రీల్స్ చేస్తు భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించారు.
ఈ క్రమంలో రీతు చౌదరీ తన సోషల్ మీడియా ఖాతాలో తిరుమలలో రీల్స్ చేసిన ఘటన పోస్ట్ చేయడంతో అది కాస్త ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. వెంటనే వారిపై టీటీడీ చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.