ఘోరమైన యాక్సిడెంట్ నుంచి జస్ట్ సెకండ్‌లో తప్పించుకున్న గీతూ రాయల్, వైరల్ వీడియో.

divyaamedia@gmail.com
1 Min Read

ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్‌గా పలు వీడియోలు చేస్తూ ఫేమస్ అయి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే చాన్స్ కొట్టేసింది. అలా సీజన్ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గీతూ ఒక దశలో ఆమె టాప్ కంటెస్టెంట్‌గా హౌస్‌ని శాసించింది. అయితే ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాతో బిజీ అయ్యింది ఆమె.. రెగ్యులర్ గా ఎదో ఒక వీడియో షేర్ చేస్తుంటుంది.

సమాజంలో జరిగే సంఘటనల గురించి ఆమె ఎక్కువగా మాట్లాడుతూ వీడియోలు చేస్తుంటుంది. తాజాగా గీతూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య ఎక్కడ చూసిన జనాలు చనిపోయిన న్యూసే వినిపిస్తుంది.. మరీ చీమలు చచ్చిపోయినట్టు పోతున్నారు జనాలు. హ్యాపీగా హనీమూన్‌కి వెళ్దామని వెళ్తే అక్కడ టెర్రరిస్టులు చంపేస్తున్నారు.

లేదా భార్య చంపిస్తుంది.. తల్లి పిల్లల్ని చంపి కుక్కర్లో ఉడకబెడుతుంది. బస్సులు, రైళ్లు , విమానాల యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు. మొన్న విమాన ప్రమాదంలో 250మంది చనిపోయారు. నాకు కూడా 20 రోజుల క్రితం ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. జస్ట్ సెకెండ్‌లో చావు నుంచి బయట పడ్డాను. మనం బతికి ఉన్నాము అంటే అది అదృష్టమనే చెప్పాలి. అందుకే మనకు నచ్చింది చేసెయ్యాలి.. అందరిని ప్రేమించాలి.

నీ ఎమోషన్స్ అన్ని చూపించెయ్.. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వేరేవాళ్లకు భాద కలిగించనంత వరకు నెక్స్ట్ సెకన్ నువ్వు చనిపోయినా నీకు ఎలాంటి పశ్చాత్తాపం కలగదు అనేలా జీవించాలి అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *