సినిమాలు మానేసి పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్న స్టార్ హీరోయిన్, ఇలా ఎందుకు చేస్తుందో తెలిస్తే.?

divyaamedia@gmail.com
1 Min Read

నాని కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకున్నాడో అర్థం అవతుంది. మరోవైపు మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తూ అమ్మాయిల్లో పాపులారిటీ కూడా బాగా సంపాదించుకున్నాడు. సినిమా ఫలితం ఎప్పుడైనా తేడా కొట్టినా.. నటుడిగా మాత్రం నాని ఫెయిల్ అవ్వడు. నాని కెరీర్‌లో భీమిలి కబడ్డీ జట్టుకు మంచి క్లాసిక్‌గా చెప్పుకోవాలి. ఈ సినిమా వాస్తవిక ప్రపంచానికి చాలా దగ్గరిగా ఉంటుంది.

సినిమాలో బోలెడంత ఫన్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో అమాయకపు పల్లెటూరి యువకుడిగా నటించి సూపర్ అనిపించాడు మన నాని. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే జనాలు తెగ చూసేస్తారు. తాతినేని సత్య డైరెక్షన్‌లో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు 2010లో రిలీజైంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ మూవీ వెన్నిళ కబడి కుళుకు రీమేక్.

అయితే ఇందులో నాని సరసన మలయాళీ హీరోయిన్ శరణ్య మోహన్ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించింది శరణ్య. అలాగే తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో కనిపించింది. తెలుగులో కృష్ణుడు హీరోగా నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమాతోపాటు హ్యాపీ హ్యాపీగా, కత్తి వంటి చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా స్టార్ హీరోలకు చెల్లిగా కనిపించింది శరణ్య.

ఆ తర్వాత ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు. 2015లో తన చిన్ననాటి స్నేహితుడు వైద్యుడు అరవింద్ కృష్ణన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శరణ్య.. ప్రస్తుతం శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది. అలాగే పిల్లలు సంగీత పాఠాలు చెబుతుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ శాస్త్రీయ సంగీతం, నృత్యం వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *