కొడుకు అడ్మిషన్ కోసం స్కూల్ కి వెళ్ళిన పవన్ కళ్యాణ్..! అదే స్కూల్లోనే స్టార్ హీరో కొడుకులు.

divyaamedia@gmail.com
1 Min Read

ఇటీవల తన చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతుండగా ఆ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించి మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి.. అప్పటినుండి అతను హైదరాబాదులోనే ఉంటుండగా తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మార్క్ శంకరును ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు సమాచారం.

ఇప్పటికే ఈ ఇక్రిశాట్ ఆవరణలో ఉన్న ఇంటర్నేషనల్ హైదరాబాద్ స్కూల్లో పలువురు సినీ ప్రముఖుల పిల్లలు చదువుతుండగా.. పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుకును కూడా ఇందులోనే జాయిన్ చేయించాలని అనుకున్నట్లు సమాచారం. మరోవైపు.. అల్లు అర్జున్ పిల్లలు కూడా చదువుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో.. ఇటీవల పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్ లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కానీ లక్ బాగుండీ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డారు. ఆయన కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. పొగ పీల్చుకొవడంవల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం.. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కొలుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ కొడుకు మార్క్‌ శంకర్ ను హైదరాబాద్ లోని ఇక్రిశాట్ అంతర్జాతీయ స్కూల్ లో అడ్మిషన్ కోసం పటాన్ చెరుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా పవన్ టీమ్ స్పందిస్తేనే ఒక క్లారిటీ రానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల మళ్లీ ఫామ్ లోకి వచ్చారని ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *