ఘోర విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య..! అదే జరిగుంటే..?

divyaamedia@gmail.com
3 Min Read

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నో విమాన, వైమానిక ప్రమాదాలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సినీ నటి సౌందర్య, మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, మాజీ కేంద్ర మంత్రి మాధవరావ్ సింధియా, భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తదితరులు విమాన ప్రమాదాల్లోనే మరణించారు. ఇదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 60 మందితో ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. నాటి ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రనటులు కూడా ఉండగా.. వీరంతా తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని వణికించిన ఆ విమాన ప్రమాదం జరిగిన రోజు… 1993 నవంబర్‌ 15. మద్రాసు ఎయిర్‌పోర్టు నుంచి ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ 440 ఎయిర్‌బస్‌ 272 మంది ప్రయాణికులతో మార్నింగ్ ఆరు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్‌కు టేకాఫ్ అయింది. కాక్‌పిట్‌లో సీనియర్‌ పైలెట్‌ కెప్టెన్‌ భల్లా, కో పైలెట్‌ వేల్‌రాజ్‌ ఉన్నారు.

ఆ రోజు విమానంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, విజయశాంతి, అల్లు రామలింగయ్య దంపతులు, మాలాశ్రీ, కమెడియన్‌ సుధాకర్‌, కాస్ట్యూమ్స్‌ కృష్ణ, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు, బాపు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, ఎండి.సుందరం, నిర్మాతలు కె.సి.శేఖర్‌బాబు, కాట్రగడ్డ ప్రసాద్‌, రాశీ మూవీస్‌ నరసింహారావు, నృత్య దర్శకురాలు సుచిత్ర, ఫైట్‌ మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌, ఛాయాగ్రాహకులు కె.ఎస్‌.హరి, అనుమోలు హరి, చిరంజీవి పర్సనల్‌ మేకప్‌మన్‌ శివ… ఇంకా ఎంతో మంది సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్నారు.

ఈ విమానంలో ఉన్నది ఎక్కువ మంది సినిమా వాళ్లే కావడంతో పలకరింపులు, జోక్స్‌, నవ్వులతో విమానంలో వాతావరణం సందడిగా మారింది. మద్రాసులో సరిగ్గా ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు విమానం అక్కడ నుంచి టేకాఫ్ అయింది. కొద్ది సేపటికే విమాన ప్రయాణికుల్లో చాలా మంది నిద్రలోకి జారుకొన్నారు. ఏడు గంటలకల్లా విమానం బేగంపేట విమానాశ్రయం చేరుకొంది. కిందకు దిగడానికి అందులో ప్రయాణిస్తున్న వారు రెడీ అవుతుండగా ఎయిర్‌పోర్ట్‌లో దట్టంగా మంచు కమ్ముకోవడంతో రన్‌ వే కనిపించడం లేదని.. అందుకే మళ్లీ మద్రాసుకు తిరిగి వెళుతున్నామనీ ఎయిర్‌హోస్టెస్‌ ప్రయాణికులకు తెలిపింది.

ఈ విమానంలో చిరంజీవి తన కూతురు శ్రీజతో ఉన్నారు. బాలయ్య తన ఇద్దరు పిల్లలతో కబుర్లు చెబుతున్నారు. ఇంతలో కో పైలెట్ కెప్టెన్ వేల్ రాజ్ వచ్చి ఎయిర్ హోస్టెస్ తో ఏదో చెప్పారు. వారిలో కంగారు కనిపించింది. దీంతో చిరు వెళ్లి వారిని అసలు విషయం అడిగారు. అయితే విమానం తిరిగి మద్రాసుకు వెళ్లడం లేదనే విషయం అందులో ప్రయాణిస్తున్న చిరు, బాలయ్య సహా అందులో ప్రయాణిస్తున్న కొంత మంది ప్రయాణికులు తెలిసింది. విమాన రెక్కలు విచ్చుకోవడం లేదు. దీంతో కంగారు పడిన వాళ్లు నిద్రపోతున్న వాళ్లను లేపారు. దెబ్బకు అందరికి నిద్ర మత్తు ఒదిలింది.

ఆ తర్వాత కెప్టెన్ భల్లా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పి ఆ తర్వాత విమానాన్ని పంట పొలాల్లో దింపారు.ఆ వేగానికి విమానం కుదుపులకు లోనైంది. పైనున్న సూట్ కేసులు గట్రా కిందా పడ్డాయి. ఆ తర్వాత విమానం నెల్లూరు జిల్లా వెంకటగిరికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాజీ పల్లె గ్రామంలోని పచ్చని పొలాల్లో విమానం ల్యాండ్ అయింది. ల్యాండ్ అవ్వగానే ఎయిర్ హోస్టెస్ లు విమానంలోని ఇతర క్రూ కలిసి విమాన తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. బాలయ్య, చిరు వెళ్లి సాయం చేయడంతో డోరు తెరుచుకుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *