బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ తన ప్రియురాలు జైనాబ్ తో కలిసి వైవాహిక జీవితానికి స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో శుక్రవారం ఉదయం మూడు గంటలకు వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు వీరి వివాహనికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సుమంత్, సుశాంత్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, పెళ్లి వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయిత అఖిల్ పెళ్లి చేసుకున్న తర్వాత జైనాబ్ రవ్జీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. జైనాబ్ హైదరాబాద్కు చెందిన కళాకారిణి. ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రావడ్జీ కూతురు.
సోషల్ మీడియాలో బ్లాగర్, బేస్పోక్ పరఫ్యూమర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు జైనాబ్. హైదరాబాద్ మూలాలున్న జైనాబ్ ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యారని సమాచారం. ముంబైలోనే రవడ్జీ ఫ్యామిలీ ఉంటున్నట్లు టాక్. వీరికి దుబాయ్, అరబ్ దేశాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయని.. జైనాబ్ ఇప్పుడు సొంతంగా ఆర్ట్స్ గ్యాలరీని నిర్వహిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు జైనాబ్ రవ్జీ, అఖిల్ ఇద్దరి మధ్య వయసు వ్యత్సాసం గురించి చర్చ నడుస్తుంది.
ఇద్దరి మధ్య 9 సంవత్సరాలు వయసు తేడా ఉందని సోషల్ మీడియాలో టాక్. అయితే ఈ విషయం ఎంత వరకు నిజమనేది తెలియరాలేదు.
Vintage Dancer Nag Bolthe 🙏🏽💥
— VAMSHI 🔥 (@vamshi_G1) June 6, 2025
E age lo kuda 🙇🏽 Aa Enargy Endaya 👏🏽 #NagarjunaAkkineni #AkhilWedding pic.twitter.com/YkXBdOnnP4