అక్కినేని అఖిల్.. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది. అయితే అక్కినేని బ్యాచిలర్ అఖిల్, తన ప్రేయసి జైనబ్తో ఏడడుగులు వేసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్గా నిర్వహించబడింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.
గతేడాది నవంబర్ 26న అఖిల్ – జైనబ్ ఎంగేజ్మెంట్ జరగ్గా, అప్పటి ఫొటోలను నాగార్జున స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడు వివాహ ఫొటోలు కూడా షేర్ చేస్తారా? లేక కొంత సమయం తీసుకుంటారా అని అభిమానుల ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు, హీరో రామ్ చరణ్ – ఉపాసన, దగ్గుబాటి వెంకటేష్, రానా తదితరులు హాజరయ్యారు.

అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొనగా, నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల, సుశాంత్, సుమంత్, నాగసుశీల, సుప్రియా తదితరులు కనిపించారు. తమ్ముడి పెళ్లిలో అన్న నాగచైతన్య సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బరాత్ కార్యక్రమంలో చైతూ చేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సుశాంత్ డ్యాన్స్తోనూ అలరించాడు. దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా బరాత్లో పాల్గొని డ్యాన్స్ చేయడం విశేషం.
ఇదిలా ఉండగా, ఈ నెల 8న (ఆదివారం) సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, పలు ప్రముఖ నటీనటులు హాజరయ్యే అవకాశం ఉంది.