ఇటీవల కాలంలో అరుదుగా అడవిలోని జంతువుల్ని, పాములు, కొండ చిలువల్ని కూడా కొంత మంది పెంచుకుంటున్నారు. అయితే.. ఇంట్లో జంతువుల్ని పెంచుకునేటప్పుడు అవి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి చేసే పనుల్ని చూస్తే మనలోని ఒత్తిడి తెలియకుండానే దూరమౌతుంది. అయితే రాయ్గఢ్ జిల్లా లైలుంగ-ఘర్గోడా ఫారెస్ట్ ఏరియాలో ఏనుగుల గుంపు నీటిలో జలకాలాటలు ఆడుతూ ఉండగా… ఆ గుంపులోని చిన్న ఏనుగు అనుకోకుండా ఒక లోతైన మట్టిగుంటలో పడిపోయింది.
అది పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. దాంతో ఆ ఏనుగు పిల్ల చేసిన అరుపులు అడవంతా మారుమోగాయి. గ్రామస్థులు దాని బాధను అర్థం చేసుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు.. జేసీబీ సాయంతో గుంత చుట్టూరా మట్టిన తవ్వి.. ఏనుగు సులభంగా బయటకు రావడానికి మార్గం ఏర్పాటు చేశారు.రెస్క్యూ తర్వాత జరిగిన సంఘటనే అసలు హైలైట్.
గుంత పైకి ఎక్కుతూ ఆ పిల్ల ఏనుగు తన తొండంతో జేసీబీ యంత్రాన్ని మెల్లగా తాకి ధన్యవాదాలు చెప్పడం కనిపించింది. ఆ భావోద్వేగ దృశ్యం అక్కడ ఉన్న అందరి హృదయాలను హత్తుకుంది. ఈ వీడియోను ఏఎన్ఐ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. “ఘర్గోడా అడవుల్లో మట్టి గుంతలో చిక్కుకుపోయిన ఏనుగు పిల్లను రక్షించగా, అది తన తొండంతో ఇలా ధన్యవాదాలు తెలిపింది,” అని రాశారు.
నెటిజన్లు ఈ వీడియోకు ఓ రేంజ్లో కామెంట్స్ పెడుతున్నారు. వన్యప్రాణులు మనుషుల కంటే మెరుగైన కృతజ్ఞత చూపిస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు.
#WATCH | An elephant calf shows gratitude after it was rescued from a mud pit in the forest area by the personnel of the Forest Department in Gharghoda, Raigarh
— ANI (@ANI) June 5, 2025
Video source: Forest Department pic.twitter.com/1kZsUrshvI