85 ఏళ్ల వయసులో కూమార్తె తీవ్ర ఆనారోగ్యానికి గురైన వేళ.. అమ్మగా ఆమె వెంట ఉంటానని చెప్పటమే కాదు.. ఆరోగ్యంగా ఉన్న తన కిడ్నీని కూమార్తెకు ఇచ్చేసిన వైనం రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది. అయితే భరత్పూర్లో నివసిస్తున్న 85 ఏళ్ల వృద్ధ మహిళ బుద్ధో దేవికి 50 ఏళ్ల కుమార్తె ఉంది.. గత కొంతకాలంగా ఆమె దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD)తో బాధపడుతోంది.
ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆసుపత్రిలో డయాలసిస్ చేయాల్సి వస్తుంది. దీంతో ఆ మహిళ ఆరోగ్యం మరింత క్షిణిస్తూ వస్తోంది. నెమ్మదిగా ఆమె లేవలేని స్థితిలోకి వెళ్లిపోతోంది. జీవితంపై ఆశ తగ్గిపోతోంది. పరిస్థితి మరింత కష్టంగా మారడంతో వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని సూచించారు.

దీంతో బుధో దేవి ముందుకు వచ్చి తన కిడ్నీని దానం చేయడానికి సిద్ధమయ్యారు. హృదయాల్ని హత్తుకునే ఈ సంఘటన ఇటు వైద్యం, మాతృత్వం రెండింటికీ కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఆపరేషన్ తర్వాత 84 ఏళ్ల తల్లిని యూరాలజీ ఐసియులో ఉంచారు.
అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శస్త్రచికిత్స తర్వాత కేవలం మూడు రోజులకే ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కుమార్తె పరిస్థితి కూడా స్థిరంగా ఉంది. మార్పిడి చేసిన మూత్రపిండం బాగా పనిచేస్తోందని, ఆమె త్వరలోనే సాధారణ జీవితానికి తిరిగి రావచ్చునని వైద్యులు వెల్లడించారు.