గత కొన్ని రోజులుగా ఆగ్నేయాసియాలో కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి పెరుగుతోంది. భారతదేశంలో కూడా ఈ కరోనా సంక్రమణ వ్యాప్తి పెరగడం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 250 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.తాజాగా మరణాల సంఖ్య కూడా నమోదవడంతో ప్రమాదఘంటికలు మోగుతున్నట్లుగా అర్థమవుతోంది. భారత్ లో వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి కాస్త ఎక్కువగానే ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఏపీ, తెలంగాణలో కేసులు నమోదవడంతో పాటు బెంగళూరుతో సహా కర్ణాటక అంతటా కరోనా వ్యాప్తి పెరుగుతోంది.
అయితే ఇండియాలో మే 19 నాటికి 257 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగం JN.1 వేరియంట్కు సంబంధించినవి. కేరళలో 95, మహారాష్ట్రలో 56, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు. సింగపూర్లో మే ఫస్ట్ వీక్లో 14,200 కేసులు నమోదయ్యాయి. హాస్పిటల్ అడ్మిషన్లు 30% పెరిగాయి. ఇండియాలో ఈ వేరియంట్ లోకల్గా స్ప్రెడ్ అవుతునట్లు అఫీషియల్ కన్ఫర్మేషల్ లేదు. కానీ పరిస్థితిని ప్రభుత్వం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తోంది. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.

గత వేరియంట్లతో పోలిస్తే ఇమ్యూనిటీ పవర్ను తప్పించుకునే సామర్థ్యం అధికంగా ఉంది. JN.1 లక్షణాలు.. JN.1 వేరియంట్ ఒమిక్రాన్ BA.2.86 లైనేజ్ నుంచి వచ్చింది. దీని స్పైక్ ప్రొటీన్లో L455S అనే మ్యూటేషన్ జరిగింది. ఇది వ్యాపించే రేటును 1.5 రెట్లు పెంచింది. ఈ వైరస్ బాడీలోకి చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి 24-48 గంటల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బాడీ పెయిన్స్, కొన్ని సందర్భాల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ లక్షణాలుగా ఉన్నాయి. కొందరిలో ఆకలి తగ్గడం, నీరసం కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా స్వల్పంగా ఉంటాయి.
4-5 రోజుల్లో తగ్గుతాయి. కానీ కేర్ఫుల్గా లేకపోతే తీవ్రమవొచ్చు. వీళ్లు కేర్ఫుల్గా ఉండాలి.. తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాళ్లకు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వేరియంట్ చాలా డేంజర్. వృద్ధులు, డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు కేర్ఫుల్గా ఉండాలి. ప్రెగ్నెంట్లు, చిన్న పిల్లలు కూడా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువ. వీరిలో వైరస్ లంగ్స్ తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని గంటల్లోనే పరిస్థితి విషమించవచ్చు. భారత్లో 92% కేసుల్లో ఇంట్లో ట్రీట్మెంట్తోనే నయమవుతోంది.

అంటే లక్షణాలు మైల్డ్గా ఉన్నాయనడానికి ఇదే సంకేతం. కానీ, పైన చెప్పిన వాళ్లు మాత్రం కేర్ఫుల్గా ఉండాల్సిందే. నివారణ చర్యలు.. ఈ వైరస్ను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రద్దీ ప్రదేశాల్లో N95 మాస్క్ ధరించడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ పవర్ను పెంచుకునేందుకు పసుపు పాలు, తులసి-అల్లం టీ, పోషకాహారం తీసుకోవాలి. వయసు పైబడిన వాళ్లు రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలి. వారి ఆరోగ్యాన్ని డాక్టర్తో రెగ్యులర్గా చెక్ చేయించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. గాలి ఆడే ప్రదేశాల్లో ఉండటం వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుంది.
ప్రస్తుత వ్యాక్సిన్లు తీవ్రమైన లక్షణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. కానీ బూస్టర్ డోస్లు తీసుకోవడం మరింత ఉపయోగకరం. కరోనా వైరస్ మనల్ని ఎప్పుడూ జాగ్రత్తగా ఉండమని గుర్తు చేస్తోంది. JN.1 వేరియంట్ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి చాలా ప్రమాదం. ఈ వైరస్ను అరికట్టడానికి రెగ్యులర్ టెస్టింగ్, గుండె, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. భారత్లో సర్వైలెన్స్ను బలోపేతం చేస్తున్నారు. పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపుతున్నారు.