అమలా పాల్కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తమిళ హీరోయిన్గా అడుగుపెట్టినప్పటికీ, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంతో కూడా అమలా పాల్ వార్తల్లో నిలిచారు. అమలా పాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే సినిమాల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన అమలాపాల్ పర్సనల్ లైఫ్ లో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది.
2014లో తమిళ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుందీ అందాల తార. అయితే మూడేళ్లకే వీరు విడిపోయారు. అనుకోని కారణాల వలన 2017లో విజయ్ తో విడాకులు తీసుకుంది అమలా పాల్. ఆ తర్వాత 2023లో అమలా జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది. 2024 జూన్ 11న వీరికి ఇలాయ్ అనే మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే మరోవైపు తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తోంది అమలా పాల్.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అమలా పాల్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తన కొడుకుకి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ‘ప్రేమ శాంతితో కూడిన ఇలై బాప్టిజం జరుపుకున్నాడు’ అని రాసుకొచ్చింది అమలాపాల్. బాప్టిజం అంటే క్రైస్తవ మతంలోకి మారడం. ఇప్పుడిదే విషయాన్ని షేర్ చేసింది అమలా పాల్.
ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అమలా పాల్ కుమారుడు చాలా క్యూట్ గా, యువరాజులా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.