ఇండస్ట్రీలో విషాదం, మంచం పట్టిన ‘బలగం’ నటుడు కన్నుమూత.

divyaamedia@gmail.com
1 Min Read

జీవీ బాబు మొత్తం జీవితం నాటకరంగంలోనే గడిపార‌ని, జీవీ బాబును బలగం సినిమా ద్వారా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయం చేసే భాగ్యం తనకు దక్కిందని వేణు అన్నారు. ఇక‌, బాబు మృతి గురించి తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే తెలుగు సినీరంగంలో విషాదం నెలకొంది. బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి బలగం మూవీ డైరెక్టర్ వేణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. జీవీ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. “జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోకే గడిపారు. చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు. జీవీ బాబు మృతి పై సినీప్రముఖులు, బలగం మూవీ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన వేణు.. బలగం సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఈ మూవీలో ప్రియదర్శి చిన్నతాత అంజన్న పాత్రలో కనిపించారు జీవీ బాబు. సహజ నటనతో ఆకట్టుకున్నారు. జీవీ బాబు రంగస్థల కళాకారుడు. ఇన్నాళ్లు రంగస్థలంపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. బలగం సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *