తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడటంతో ఆయన్ని హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

వంశీ హెల్త్ కండీషన్పై కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. వల్లభనేని వంశీపై నమోదైన 8 కేసులకు సంబంధించి గత కొద్దిరోజులుగా పోలీసులు వైసీపీ నేతను విచారిస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్..వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 100రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉంచారు పోలీసులు.
అయితే తాజాగా వంశీని బావులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారించేందుకు కంకిపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. శనివారం కూడా విచారణ జరపాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ఆయన్ని స్టేషన్లోనే ఉంచారు. అయితే రాత్రి ఊపిరి పీల్చుకోవడానికి వంశీ ఇబ్బంది పడ్డట్లుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీకి శ్వాసకోస సమస్యతో బాధపడుతూ ఉండటంతో పోలీసులు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్యం అందిస్తున్నారు. అయితే వంశీ హెల్త్ కండీషన్ సీరియస్గా ఉండటంతో ఆయన భార్య వంకజశ్రీ, వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.

వంశీకి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎయిమ్స్కి తరలించాలని.. ఆరోగ్యం బాగోలేక ఇబ్బందిపడుతుంటే కేసుల పేరుతో వేధించడం సరికాదని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. వంశీ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం వంశీకి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. వైసీపీ నేతలు, వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే హెల్త్ కండీషన్పై ఆందోళన చెందుతున్నారు.