హనుమంతుడి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి, ఆశీర్వాదాలు పొందడానికి వివిధ మతపరమైన ఆచారాలను నిర్వహిస్తారు. వీటిలో ఒక ముఖ్యమైన ఆచారం హనుమంతుని కోసం 40 రోజులు ఉపవాసం ఉండటం. అయితే మధ్యప్రదేశ్ కట్ని జిల్లా నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ముహాసాలో ఉన్న హనుమంతుడి ఆలయం ప్రపంచ ప్రసిద్దిగాంచింది. ఈ ఆలయం మంగళ, శనివారాల్లో భారీ రద్దీ నెలకొంటుంది. ఈ ఆలయంలో ఉన్న మూలికలను నమలడం ద్వారా విరిగిన ఎముకలు నయమవుతాయని నమ్ముతారు. వైద్యులు విరిగిన ఎముకలను కలపడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వేయమని సలహా ఇచ్చిన బాధితులు సైతం ఇక్కడకు వచ్చి ఆ మూలికను తీసుకున్నారని.. వారి ఎముకలు జాయింట్ అయ్యాయని స్థానికులు చెబుతారు.

ఆ తరువాత వైద్యులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మనుషుల ఎముకల సమస్యలు మాత్రమే కాదు జంతువుల ఎముకలు కూడా ఇక్కడ మూలికలు తిన్న తర్వాత కలిసిపోయాయి. స్ట్రెచర్లపై , అంబులెన్స్లలో కూడా వచ్చే రోగులు..మంగళ, శనివారాల్లో ఇక్కడ భక్తులు బారులు తీరతారు. పొడవైన క్యూల్లో వేచి ఉంటాయి. అంతేకాదు రోగులు స్ట్రెచర్పై, అంబులెన్స్లో విరిగిన ఎముకలతో ఆర్థోపెడిక్ డాక్టర్ హనుమంతుడి చేసే చికిత్స కోసం ఈ ఆలయానికి వస్తారు. ఇక్కడికి వచ్చిన బాధితులు అందరూ స్వస్థత పొంది తిరిగి వెళతారని నమ్మకం. 40 సంవత్సరాలుగా చికిత్స పొందుతున్న భక్తులు..ఈ ఆలయ చరిత్ర లోకి వెళ్తే..
ఈ ఔషధాన్ని 40 సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ ఆలయ పూజారికి ఇచ్చాడట. ఆ తరువాత.. ఆలయ పూజారి సుఖ్మాన్ లాల్ జీ భక్తులకు చికిత్స చేయడం ప్రారంభించారు. పుజారీ ఇచ్చిన మూలికను తీసుకున్న భక్తులకు ఉపశమనం లభించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా క్రమంగా దేశమంతటా వ్యాపించింది. ఇప్పుడు ఈ ఆలయంలో పుజారీ పాండా శర్మన్ పటేల్ బాధితులకు ములికను ఇస్తాడు. ఔషధం (మూలిక) ఎలా ఇస్తారంటే.. ఇక్కడికి వచ్చే భక్తులను మొదట రామ నామాన్ని జపించమని అడుగుతారు.

తరువాత కళ్ళు మూసుకోమని చెప్పి.. వారి నోటిలో కొంత మూలిక వేసి తినిపిస్తారు. ఈ మూలికను నమిలి తినాలి. దీని తరువాత రోగిని ఇంటికి పంపుతారు. ఇక్కడికి వచ్చి దేవుడిచ్చిన మందు తిన్న వారికి 100% ఉపశమనం లభిస్తుందని అంటారు. అందుకే ప్రతి మంగళవారం, శనివారం ఈ ఆలయంలో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. ఎముకలకు సంబంధించిన ఇబ్బంది పడేవారు ఈ మూలిక తినడానికి గంటల తరబడి వేచి ఉంటారు.