2025లో మళ్ళీ ఘోర విపత్తు జరబోతుందా..? బాబా వంగా చెప్పిన జోతిష్యం తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

బాబా వంగా.. ఇప్పటికే అనేక విషయాలపై ఈమె జోస్యం చెప్పగా.. చాలా వరకు అవి నిజం అయ్యాయి. చిన్న వయసులోనే చూపు కోల్పోయిన ఈమె ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెబుతుంటారు. అయితే బల్గేరియాకు చెందిన బాబా వంగా.. ఆమె చిన్నప్పుడే చూపు కోల్పోయింది. అయినా ఈమె భవిష్యత్తులో జరగబోయే ప్రకృతి విపత్తులు వంటి వాటిని అంచనా వేసి భవిష్యవాణి వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈమె చెప్పిన చాలా విషయాలు నిజంగా జరిగాయి.

ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ప్రపంచ యుద్ధాల వంటి వాటి గురించి ఈమె జోస్యం చెప్పింది. అయితే కరోనా అనే వ్యాది ప్రపంచాన్ని వణికిస్తుందని కూడా ఆమె ముందే చెప్పారు. అమె చెప్పినట్టుగానే కరోనా వచ్చిన ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఈమె చెప్పే జోతిష్యాన్ని చాలా వరకు జనాలు నమ్ముతారు. అయితే 2025లో పెను విపత్తు సంభవించబోతున్నట్లు ఈమె ఇటీవలే జోస్యం చెప్పింది. ఆ విపత్తు ప్రంచాన్ని కుదిపేసే స్థాయిలో ఉంటుందని తెలిపింది. దీంతో ఆమె చెప్పిన జోష్యాలను నమ్మే అభిమానులు, ఆమె అనుచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అయితే పెను విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పినప్పటికీ అది ఏ రూపంలో వస్తుందో అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేనట్టు తెలుస్తోంది. అంటే అది ప్రపంచ యుద్ధమా? ప్రకృతి విలయాలా? లేక ఆర్థిక పరంగా నష్టపోవడమా అనేది దానిపై స్పష్టత లేదు. అయినా కూడా ఆమె జ్యోతిష్యాన్ని నమ్మె కొందరు మాత్రం ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. బాబా వంగా భవిష్యవాణులు తరచూ అస్పష్టంగా ఉంటాయని, వాటిని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని విమర్శకులు అంటున్నారు.

ఆమె జోస్యాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని, కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా సరిపోలినవిగా భావిస్తారు. అయితే ఈ జోస్యాలు చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాటి ఖచ్చితత్వం గురించి సందేహాలు ఉన్నాయి. ఈ భవిష్యవాణులు నిజమవుతాయో లేదో తెలియాలంటే 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు చూడాల్సి ఉంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *