కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ సమీపంలోని కొరికొప్ప హనుమాన్ ఆలయంలో గత 150 సంవత్సరాలుగా ముస్లింలే పూజారులుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇది హిందూ సోదరులు వారికి ఇచ్చిన ప్రత్యేక హక్కుగా తెలిసింది. అయితే మన దేశం వైవిధ్యానికి నిలయం. ఇక్కడ అన్ని మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ చాలాసార్లు మనం మత సామరస్యాన్ని తెలిపే సంఘటనల గురించి వార్తలు వింటాము. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఏ మతమైనా విశ్వాసమే గొప్పదని చాటి చెబుతాయి. ఈ రోజు మనం హిందువులు కాదు ముస్లింలు పుజాదికార్యక్రమలను మతం, ఆరాధనలు పాటించే ఆలయం గురించి తెలుసుకుందాం.
ఇక్కడ ముస్లింలు కూడా హనుమంతుడిని పూజిస్తారు. దాదాపు 150 సంవత్సరాలుగా.. ముస్లిం పూజారులు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ముస్లింలు హనుమంతుడిని పూజిస్తారు. హిందూ మతంలో హనుమంతుడిని సంకట మోచనుడు (అన్ని కష్టాలు, దుఃఖాలు, కష్టాలు, సమస్యలను క్షణాల్లో తొలగించేవాడు) అని చెబుతారు. ఇందుకు కొన్ని సంఘటనలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు పూజించే హనుమంతుడి ఆలయం ఎక్కడ ఉన్నదంటే..

ఈ ఆలయం ఎక్కడ ఉంది..ఈ ఆలయం కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప గ్రామంలో ఉంది. ఈ ఆలయం పేరు లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయం. ఈ ఆలయం పట్ల ప్రజల విశ్వాసం, నమ్మకాలు చాలా బలంగా ఉన్నాయి. హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు. అయితే ఇక్కడ పూజ చేసేది మాత్రం ముస్లింలు మాత్రమే. ఈ ఆలయానికి ఎవరు వచ్చినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని, వారు కష్టాలను అధిగమించి హనుమంతుడి ఆశీస్సులు పొందుతారని చెబుతారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన కథ.. నిజానికి ఈ ఆలయంలో ముస్లింలు పూజలు చేయడం వెనుక ఒక ప్రసిద్ధ కథ ఉంది.
ఈ గ్రామంలో కలరా వ్యాపించిన తర్వాత, గ్రామంలోని ప్రజలందరూ నెమ్మదిగా చనిపోవడం మొదలైంది. అదే సమయంలో భయంతో కొంతమంది గ్రామాన్ని వదిలి వెళ్లడం ప్రారంభించారని చెబుతారు. కొన్ని రోజులకే గ్రామం దాదాపు ఖాళీ అయింది. అయితే అక్కడ కొన్ని ముస్లిం కుటుంబాలు తమ ఉన్న ఊరిని వదులలేక .. అక్కడ ఉన్న హనుమంతుడి ఆలయంలో పూజించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంగా ఆ వ్యాధి అంతమైంది. అప్పటి నుంచి ఈ ఆలయానికి వచ్చే వ్యక్తి భక్తుడి ప్రతి కష్టమూ తొలగిపోతుందనే నమ్మకం భక్తులకు పెరిగింది.
ఈ సంఘటన నుంచి నేటి వరకు, ముస్లిం మతస్తులకు సంబంధించిన చెందిన వారు మాత్రమే ఈ హనుమంతుడి ఆలయాన్ని పూజించే బాధ్యతను తీసుకున్నారు. కనుక మతం ఏదైనా విశ్వాసం గొప్పదని నిరూపిస్తున్నారు ఇక్కడ ఉన్న ముస్లింలు. శని, మంగళవారాల్లో భారీ సంఖ్యలో భక్తులు.. ఇక్కడ ఐక్యతా స్ఫూర్తిని తెలియజేసే విధంగా శని, మంగళవారాల్లో హనుమంతుడి ఆలయంలో అందరూ ఒకటి అవుతారు. స్థానికులతో పాటు పొరుగు గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హనుమంతుడిని పూజించడానికి వస్తారు. ఈ సందర్భంలో ఈ గ్రామంలోని మనుషుల శాశ్వత ఐక్యత, మత సామరస్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.