ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా..? అసలు విషయమేంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

సాధారణ ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే ఆర్బీఐ ఉద్దేశం. తరచుగా ప్రజలు ATM నుండి రూ. 500 లేదా రూ. 2000 నోట్లను విత్‌డ్రా చేసిన తర్వాత వాటిని చల్లర చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చిన్న దుకాణదారులు, సాధారణ ప్రజల వద్ద తరచుగా పెద్ద నోట్లకు బదులుగా చిల్లర ఉండదు. ప్రజలు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటానికి ఏటీఎంల నుండి నేరుగా చిన్న నోట్లను పొందాలనే ఉద్దేశంతో ఆర్బీఐ బ్యాంకులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ పోస్ట్‌ను చూసిన కొందరు ₹500 రూపాయల నోట్లను చలామణి నుంచి తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పరిశోధించినప్పుడు ఆర్‌బీఐ బ్యాంకులకు నిజంగానే ఒక ఆదేశం జారీ చేసింది. అయితే ఈ ఆదేశంలో ₹500 రూపాయల నోటును నిలిపివేయడం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అసలు ఆర్‌బీఐ ఆదేశం ఏమిటంటే బ్యాంకులు తమ ఏటీఎంలలో ₹100, ₹200 రూపాయల నోట్ల లభ్యతను పెంచాలని చూస్తుంది.

₹500 రూపాయల నోట్లను ఆర్‌బీఐ నిలిపివేస్తుందా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆర్‌బీఐ బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాల్లో ఈ ₹500 రూపాయల నోట్లను నిలిపివేస్తున్నట్లు ఎటువంటి సూచన కూడా ఇవ్వలేదు. ఈ నోటు మునుపటిలాగే చలామణిలో ఉంటుంది. వైరల్ పోస్ట్‌లో చెప్పిన విషయాలు పూర్తిగా తప్పు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తిగా తప్పు. ₹500 రూపాయల నోటును నిషేధించలని ఆర్‌బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏటీఎంలలో ₹100, ₹200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని మాత్రమే బ్యాంకులకు సూచించింది. తద్వారా చిన్న నోట్లు సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *