స్టార్ హీరో ఆరోగ్యం క్షీణించి ఆసుప‌త్రిలో చేరారా..! స్వయంగా క్లారిటీ ఇచ్చిన ఉపేంద్ర.

divyaamedia@gmail.com
2 Min Read

ఉపేంద్రకి ప్రస్తుతం 56 ఏళ్ళు. బహుశా ఆయనకు యాసిడిటీ సమస్య ఉండి ఉండవచ్చని అంటున్నారు. ఎందుకంటే, గతంలో ‘UI’ సినిమా షూటింగ్ సమయంలో కూడా యాసిడిటీ సమస్యతో బాధపడ్డారు. ఎక్కువ సేపు షూటింగ్, పని ఒత్తిడి, తినే అలవాట్లలో మార్పులు వంటి అనేక కారణాల వల్ల ఈ ఆరోగ్య సమస్య వచ్చి ఉండవచ్చని అంచనా. అయితే ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించిందని వార్తలు రావడంతో కంగారు పడ్డారు. దీనికి తోడు ఉప్పీ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

దీంతో అభిమానులు బాగా టెన్షన్ పడ్డారు. అయితే కొద్ది గంటల్లోనే ఉప్పీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇది విన్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఉపేంద్ర గత కొన్ని రోజులుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ‘UI’ సినిమా షూటింగ్ సమయంలోనూ ఉపేంద్ర ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. ‘బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఉపేంద్ర ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఉప్పీ సన్నిహితులు తెలిపారు.

ఇక కొద్ది సేపటికే ఉపేంద్ర కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.. ‘అందరికీ నమస్కారం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం మాత్ర‌మే నేను ఆసుపత్రికి వెళ్లాను. అంతే త‌ప్ప‌.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విని అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెంద‌వ‌ద్దు. మీ ప్రేమ‌, అభిమానానికి నా ధ‌న్య‌వాదాలు’ అని ఉపేంద్ర ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు కూల్ అయ్యారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *