రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్‌ల్లో టిఫిన్ చేసిన స్టార్ హీరో, స్వయంగా దోసె వేసుకొని ఎలా తిన్నాడో చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

సోనూ సూద్ పంజాబ్ లోని మోగా అనే అనే పట్టణంలో జన్మించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే ప్రముఖ నటుడు సోనూసూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్‌ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికీ కొనసాగుతోంది. ఈ కారణంగానే సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూసూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు.

తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని కూడా ప్రకటించాడు. సోనూసూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్‌గా నటించినా.. నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సాయం చేశారు. జబ్బుపడిన వారికి చికిత్స అందించారు. పేద పిల్లల చదువుకు సహకరించారు. సోనూ సూద్ చిన్న వ్యాపారులకు సాయం అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ మంచి మనసు చాటుకుంటున్నాడు. తాజాగా చెన్నైలో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఒక మహిళతో సోనూసూద్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఫుడ్ స్టాల్ నడుపుతున్న మహిళతో సోనూ ఫన్నీ సంభాషణ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ వీడియోలో, సోనూ ఇడ్లీ తిన్నాడు ఆతర్వాత అతనే స్వయంగా దోసె వేసే పనిలోకి దిగాడు. ఈ వీడియోను నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సోను సూద్ 3 ఇడ్లీలు మరియు 2 వడల ధర కేవలం 35 రూపాయలు అని చెప్పుకొచ్చాడు. అలాగే ఆమెతో నాకు డిస్కౌంట్ కావలి అని అడుగుతే 5 రూపాయిలు డిస్కౌంట్ ఇస్తాను అని ఆమె సరదాగా చెప్పింది. అలాగే దోసె మాములుగా 15 రూపాయిలు అని తాను వేసిన దోసె 30రూపాయిలు అంటూ సరదాగా అన్నారు. రీసెంట్ గా ఫతే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సోనూ సూద్.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *