నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై వేణు స్వామి సంచలన ప్రకటన.

divyaamedia@gmail.com
2 Min Read

ఫైనల్‌గా రూమర్స్ నిజం చేస్తూ.. చైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. చైతన్య, శోభితలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. అయితే నిశ్చితార్థం చేసుకున్న కొత్త జంట అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ వివాహ జీవితం ఎలా ఉంటుందో ప్రకటన చేయనున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు.

దీంతో మరోసారి వేణు స్వామి పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. సినీ నటి సమంతతో విడాకులైన కొన్ని సంవత్సరాల అనంతరం సినీ నటుడు నాగచైతన్య మళ్లీ వివాహం చేసుకోబోతున్నాడు. హీరోయిన్‌ శోభిత ధూళిపాళతో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నాడని వార్తలు వచ్చాయి. కాకపోతే వారిద్దరూ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఈ వార్తలు ప్రచారమవుతున్న సమయంలో గురువారం వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.

నాగచైతన్య, శోభిత నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అయితే వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందోనని తాను చెబుతానంటూ వేణుస్వామి ప్రకటన చేసి సంచలనం రేపారు. దీంతో చై,శోభితల నిశ్చితార్థంతోపాటు వేణుస్వామి జ్యోతిష్యం ఎలా ఉంటోందనని ఆసక్తికర చర్చ మొదలైంది. నిశ్చితార్థం జరిగిన రోజే వేణు స్వామి తన వాట్సప్‌ స్టేటస్‌లో ఓ ప్రకటన చేశారు. ‘నాగచైతన్య, శోభిత దూళిపాల వైవాహిక జీవితంపై సంచలనాత్మకమైన జాతకరపరమైన విశ్లేషణ రేపు’ అంటూ వాట్సప్‌ స్టేటస్‌ పెట్టుకున్నారు.

దీంతో ఆయన విశ్లేషణ ఎలా ఉంటుందోనని ఉత్కంఠ ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో వేణుస్వామి ప్రకటనపై విస్తృత చర్చ జరిగింది. వారిద్దరి వివాహ జీవితం ఎలా ఉంటుందో తేల్చేస్తానని వేణుస్వామి ప్రకటన చేయడం సంచలనం రేపుతోంది. గతంలో నాగచైతన్య, సమంత ఇద్దరూ విడిపోతారని మొట్టమొదటగా చెప్పి వేణు స్వామి సంచలనం రేపారు. ఇప్పుడు మళ్లీ నాగచైతన్య వివాహ జీవితంపై వేణు స్వామి చెబుతుండడంతో ఆయన ఏం చెబుతారోనని నెటిజన్లు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *