ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న చాలా స్మార్ట్ఫోన్లు వైఫై కాలింగ్ ఫీచర్తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఉపయోగించే వినియోగదారు మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. అయితే భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్లను ఉపయోగిస్తున్న వారు ఎలాంటి రీచార్జీ లేకుండానే కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. ముఖ్యంగా ఖరీదైన రీచార్జ్ ప్లాన్లను పదే పదే రీఛార్జ్ చేసుకోవడంలో అలసిపోతే ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉందని నిపుణులు చెబుతన్నారు.
మీ నంబర్ను పనిలోకి తీసుకురావడానికి ఇక్కడ ఒక ట్రిక్ ఉందని చెబుతున్నారు. ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండా యాక్టివ్ ఉచిత కాల్స్ లభిస్తాయి. మీకు కావాల్సిందల్లా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, వైఫై కాలింగ్ మాత్రమే. కనెక్ట్ అయి ఉన్నప్పుడు అనవసరమైన రీఛార్జ్లను నివారించడానికి ఈ ఫీచర్ మీకు సహాయపడుతుంది. చాలా ఆధునిక స్మార్ట్ఫోన్లు వైఫై కాలింగ్ ఫీచర్తో వస్తాయి. దీని వల్ల వినియోగదారులు మొబైల్ నెట్వర్క్ లేకుండానే కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంటే మీ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసినప్పటికీ మీరు ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు కాల్స్ చేయడం కొనసాగించవచ్చు.
అనుకోని సందర్భంలో బ్యాలెన్స్ అయిపోతే ఎలాంటి రీచార్జీ లేకుండానే ఈ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఇలా..మీ స్మార్ట్ఫోన్ సెట్టింగ్లను తెరవాలి. అనంతరం నెట్వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్లకు వెళ్లాలి. సిమ్ కార్డ్ & మొబైల్ నెట్వర్క్ను ఎంచుకోవాలి. అయితే మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును ఎంచుకోవాలి. కిందకి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్ను ఎంచుకోవాలి. అనంతరం వైఫై కాలింగ్ను యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ అయిన తర్వాత, మొబైల్ నెట్వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా మీ పరికరాల్లో అందుబాటులో లేనప్పుడు మీ స్మార్ట్ఫోన్ కాల్ల కోసం ఆటోమెటిక్గా వైఫైను ఉపయోగిస్తుంది.