సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య ఆమెతో నాలుగేళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో ఈ ఇద్దరి బంధం తుడిచిపెట్టుకుపోయింది. సమంతతో డివోర్స్ తీసుకొని శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య. అయితే కొన్ని కారణాల తర్వాత వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో అంటు సమంత అభిమానులు, ఇటు చైతూ అభిమానులు షాక్ అయ్యారు. దీంతో కొందరు సామ్ను ట్రోల్ చేయగా మరికొందరు చైతూను ట్రోల్ చేశారు.
అయితే ఇటీవల నాగచైతన్య, శోభితను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సమంత అభిమానులు, అసలు చై సమంతకు పరిచయం కాకుండా ఉంటే బాగుండూ, తన లైఫ్ డిస్ట్రాబ్ చేశారంటూ తెగ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఏమాయ చేశావే సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కథను తాను మహేష్ బాబును ఊహించుకొని రాసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
వాస్తవంగా ఏమాయ చేశావే సినిమా కథను మహేష్ బాబును ఊహించుకొని రాశను, ఆయనకు కూడా కథ బాగా నచ్చింది. కానీ తన ఇమేజ్కు అది సూటి కాదు అనే ఉద్దేశ్యంతో ఆ మూవీకి మహేష్ బాబు నో చెప్పారంటూ చెప్పింది. దీంతో సమంత అభిమానులు, ఏమాయ చేశావే సినిమా మహేష్ బాబు ఓకే చేసి ఉంటే, సమంత, నాగచైతన్యకు పరిచయం కాకపోయేది, వీరిద్దరు వివాహం చేసుకోకపోయేవారు, ఎవరి లైఫ్ వారికి హ్యాప్పీగా ఉండేది అంటూ ముచ్చటిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్గా మారింది.