దెబ్బకు దిగొచ్చి.. వారిని క్షమాపణ కోరిన జ్యోతిష్యుడు వేణు స్వామి.

divyaamedia@gmail.com
2 Min Read

సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం స‌ృష్టించారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన. అయితే గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారు అంటూ గెస్ చేశాడు. ఆయన అన్నట్టే అది జరిగింది.

అంతే నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని ఊదరగొట్టాడు.. దొరికిన యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఆ హీరో హీరోయిన్ విడిపోతారు, పెద్ద హీరో అనారోగ్యానికి గురవుతాడు, ఓ సినీ పెద్ద చనిపోతాడు అంటూ పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. సినిమా వాళ్లనే కాదు రాజకీయ నాయకులను కూడా వదల్లేదు వేణు స్వామి. ఏపీ ఎన్నికల సమయంలో జగన్ ఘనవిజయం సాధిస్తారు అని చెప్పాడు అది జరగలేదు. దాంతో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు రాజకీయ నాయకుల జాతకం చెప్పను అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఆతర్వాత నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకున్నారో లేదో విడిపోతారు అంటూ మరోసారి తన నోటికి పని చెప్పాడు ఈ జ్యోతిష్కుడు. శుభమా అని ఆ ఇద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అపశకునాలు పలుకుతావా అని అక్కినేని ఫ్యాన్ మనోడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దాంతో క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పుకొచ్చాడు. తాజాగా ఉమెన్స్ కమిషన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాడు వేణు స్వామి. శోభిత, నాగచైతన్య విడిపోతారు అంటూ చేసిన కామెంట్స్ పై వేణు స్వామికి ఉమెన్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది.

కాగా, అప్పుడే ఉమెన్స్ కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణు స్వామి హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా మనోడికి పనిజరగలేదు. ఉమెన్స్ కమిషన్ ముందు హాజరుకావాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. దాంతో తెలంగాణ ఉమెన్స్‌ కమిషన్‌కు వేణు స్వామి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇక పై ఇలాంటి అర్ధంపర్ధం లేని కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఉమెన్స్ కమిషన్ వేణు స్వామికి అక్షింతలు వేసింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *