రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. రష్మిక మందన్న.. కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. అయితే రష్మిక మందన్న ప్రస్తుతం సోషల్ మీడియాలో తరచుగా వార్తలలో ఉంటున్నారు.
తాజాగా, ఆమె న్యూయర్ వేడుకల వేళ నిక్కర్ వేసుకుని హల్ చల్ చేశారు. దీంతో నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారంట. రష్మిక మందన్న నటించిన పుష్ప2 మూవీ ఇటీవల బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక మందన్న ఒక వైపున మూవీస్ లో బిజీగానే ఉంటు మరోవైపు తన ప్రియుడు విజయ్ దేవర కొండతో కలిసి తరచుగా ట్రిప్ లు వేస్తున్నట్లు తెలుస్తొంది.
రష్మిక తొలికన్నడ చిత్రం కిరిక్ పార్టీ.. ఇటీవల దీనిపై మరోసారి వివాదం వార్తలలో నిలిచిందని చెప్పుకొచ్చు. ఈ మూవీలో.. రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. దీనికి రిషభ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే.. కిరిక్ పార్టీ సమయంలో.. రష్మిక మందన్న..రక్షిత్ శెట్టి తోనే ఈమె ప్రేమలో పడినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఈ వ్యవహారం.. నిశ్చితార్థం వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
కొన్నినెలల తర్వాత అనుకొకుండా.. వీరు ఎంగెజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. నటి రష్మిక ఇటీవల విజయ్ దేవర కొండతొ కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కన్పించారు. అంతేకాకుండా ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ ప్రొగ్రామ్ లో సైతం రష్మిక పెళ్లి గురించి రచ్చ జరిగిన విషయం తెలిసిందే.