అలెర్ట్, రోజుకు రెండుసార్లు అన్నం తినేవారికి ఆ అనారోగ్య సమస్య ఖచ్చితంగా వస్తుంది.

divyaamedia@gmail.com
1 Min Read

మన దేశంలో అత్యధికంగా వినియోగించే ఆహారం బియ్యం. చాలా మంది అన్నం లేని భోజనం చేసేందుకు ఇష్టపడరు. రోజూ అన్నం తినడంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిత్యం అన్నం తినడం వల్ల మంచి, చెడు రెండూ ఉంటాయన్నారు. అన్నం తింటే బరువు పెరుగుతారని, మధుమేహం వస్తుందని చెబుతుంటారు. విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉన్నందున వైట్ రైస్ తినడం చాలా ప్రమాదకరం.

అయితే రోజుకు ఒకసారి కంటే ఎక్కువ సార్లు అన్నం తినడం ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే అది మీరు తినే అన్నం మొత్తం, అన్నం రకం, తినే బియ్యంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఉన్నందున రోజుకు 1 నుంచి 2 సార్లు అన్నం తినమని సలహా ఇస్తుంటారు. అయితే ఇంతకంటే ఎక్కువగా అన్నం తింటే మీ శరీరంలో అదనపు కేలరీలు పెరుగుతాయి.

రోటీకి బదులుగా రోజుకు 1 నుంచి 2 సార్లు ఒక కప్పు అన్నం తినవచ్చు. బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తింటే అందులో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.

బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తినడం గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు వంటి ప్రోబయోటిక్‌తో కూడిన అన్నం తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అప్పుడప్పుడు ఇడ్లీ, దోస లేదా బిర్యానీ వంటి వంటకాలను కూడా ప్రయత్నించవచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *