వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు, ఏపీకి వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు.

divyaamedia@gmail.com
2 Min Read

శనివారం.. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర అంతర్గత తమిళనాడుపై విస్తరించి సముద్ర మట్టంనకు 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి వైపుకు వంగి ఉంది. ఉపరితల ద్రోణి తూర్పు మధ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రం మీదునున్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతమునుండి దక్షిణ కేరళ మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ & 5.8 కిమీల మధ్య తమిళనాడు మీదుగా నున్న ఉపరితల ఆవర్తనం వరకు అనుసంధానించబడింది.

అయితే ఆంధ్రప్రదేశ్‌ను వానగండం వెంటాడుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ముందుజాగ్రత్తగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షసూచనతో తిరుపతి, నెల్లూరు కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఎల్లుండి కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *