రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా ఇదే, మళ్ళీ ఇంకో సినిమా ఎందుకు చెయ్యలేదంతే..?

divyaamedia@gmail.com
2 Min Read

వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా ఇక లేరనే వార్త విని వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకుంటున్నారు. బాలీవుడ్‌తో అనుబంధం ఉన్న నేపథ్యంలో రతన్‌ టాటా నిర్మించిన సినిమాను కొందరు గుర్తుచేసుకుంటున్నారు.

భారతీయ వ్యాపార విలువలకు ప్రతిబింబంగా నిలిచిన రతన్ టాటా దాతగా కూడా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. అయితే, రతన్ టాటాకు సినీరంగంతో కూడా సంబంధం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. బిగ్ బీ అమితాబ్ నటించిన ఓ హిందీ సినిమాకు ఆయన సహ ప్రొడ్యోసర్‌గా వ్యవహరించారు. 2004లో విడుదలైన ఏత్‌బార్ అనే సినిమాకు ఆయన జతిన్ కుమార్‌తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ మూవీలో అమితాబ్‌తో పాటు ఆయన కూతురిగా బిపాశా బశు, ఆమె ప్రియుడిగా జాన్ అబ్రహాం నటించారు. ప్రేమ, వ్యామోహం, కుటుంబ సంబంధాలు కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో డా. రణ్‌వీర్ మల్హోత్రా పాత్రలో అమితాబ్ నటించారు. ఆయన కూతురు రియా పాత్రలో బిపాశా, ఆమె ప్రేమికుడు ఆర్యన్ త్రివేదీ పాత్రలో జాన్ అబ్రహాం నటించారు. ఆర్యన్ పూర్వాపరాలు తెలుసుకోకుండా తన కూతురు అతడి ప్రేమలో పడటం డా. మల్హోత్రాకు అస్సలు నచ్చడు.

అతడి జీవితంలోని చీకటి కోణం మల్హోత్రాను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో తలెత్తిన ఘర్షణ, తండ్రి ఆందోళన, ఆర్యన్ తీరు మధ్య సస్పెన్సన్ థ్రిల్లర్‌‌గా సాగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్నే మూటకట్టుకుంది. దిగ్గజ నటీనటులతో, రూ.7.96 కోట్ల బడ్జెట్‌తో తీసిని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.9.50 కోట్లు మాత్రమే రాబట్ట కలిగింది. అయితే, రతన్ టాటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఒకేఒక సినిమాగా నిలిచింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *