ఎనిమిది నిమిషాలు చనిపోయి.. తర్వాత ఏమైందో చెప్పిన మహిళ, ఆత్మకు చావు ఉండదని..?

divyaamedia@gmail.com
1 Min Read

మనిషి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది..? అనేది అంతుచిక్కని ప్రశ్న. దీని గురించి కొందరు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నియర్ డెత్ ఎక్స్ పీరియెన్సెస్ గురించి తెలుసుకోవటం కష్టమని వారు చెబుతున్నారు. అయితే, తాజాగా.. అమెరికాలోని కొలరాడోకు చెందిన 33ఏళ్ల బ్రయానా లాఫర్జీ అనే మహిళ చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో చెప్పింది. అయితే కొలరాడోకి చెందిన బ్రియానా లాఫెర్టీ(33) తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పింది.

ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిముషాల తరువాత ఆమె లేచి కూర్చుని, తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు ‘సిద్ధంగా ఉన్నారా’? అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపారు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. ‘మరణం ఒక భ్రమ? ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది. అది రూపాంతరం చెందుతుంది.

మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయని నేను గ్రహించాను. ఇది ఒక వరం’ అని లాఫెర్టీ ‘ది మిర్రర్’కు చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో నేను అకస్మాత్తుగా నా భౌతిక శరీరం నుండి విడిపోయాను. నేను అప్పటి నా మానవ స్వభావాన్ని చూడలేదు. గుర్తుంచుకోలేదు. నేను పూర్తి నిశ్చలంగా ఉన్నాను. సజీవంగా, అవగాహనతో, గతంలో కంటే అధిక ప్రశాంతతను అనుభూతి చెందాను.

ఎటువంటి నొప్పీలేదు. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉంది. ఆ సమయంలో మన భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నాను. అక్కడ మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవి బేషరతు ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయి. అక్కడ సమయం అనేది లేదు. అయినప్పటికీ అంతా పరిపూర్ణంగా ఉంది’ అని లాఫెర్టీ తెలిపారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *