సచివాలయ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్న‌ల్ ... Darsi Live News

సచివాలయ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్న‌ల్ ... Darsi Live News

హైదరాబాద్‌ : తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై పది పిటిషన్‌లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌లపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేస్తూ.. సచివాలయం కూల్చి వేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్లు వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనను తోసిపుచ్చుతూ.. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం వివరించింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి