నేటి ఏలూరి సమావేశంపై సర్వత్రా చర్చ

నేటి ఏలూరి సమావేశంపై సర్వత్రా చర్చ

పర్చూరు, న్యూస్‌టుడే: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మార్టూరు మండలం ఇసుకదర్శిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించనున్న సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లోని తన గ్రూపుల్లో శనివారం ఆయన పెట్టిన పోస్టులూ ఆసక్తికరంగా మారాయి. రెండుసార్లు మీ బిడ్డగా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందున నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పని చేస్తానని వాటిల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సంక్షేమానికి నిరంతరం ఆలోచించినట్లు తెలిపారు. రాజకీయ మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అయితే కొంతకాలంగా పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిని ఆయన ఖండించకపోవడం, వైకాపా నేతలు కొందరు తమ పార్టీలోకి ఏలూరి వస్తున్నారని ప్రచారం చేయడం తెదేపా శ్రేణుల్లో అనుమానాలను మరింత రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే నిర్వహించబోయే సమావేశంపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

#TDPSongs #TeluguDesamPartySongs అదిరిపోయే పాట || తెలుగు దేశం పార్టీ || Telugu Desam Party New Song 2020

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి